బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: కరోనా టెన్షన్, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఉరి వేసుకుని ఆత్మహత్య, ఫ్యామిలీ భయంతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తనకు ఎక్కడ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తుందో ?, నా కుటుంబ సభ్యులు ఎక్కడ నన్ను దూరం పెడుతారో ? అనే ఆవేదనతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆసుపత్రిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బెంగళూరు సిటీలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !

 కరోనా అని అనుమానంతో ?

కరోనా అని అనుమానంతో ?

బెంగళూరు నగరంలోని విజయనగరలో సమీపంలో నివాసం ఉంటున్న 61 ఏళ్ల వ్యక్తి శుక్రవారం అనారోగ్యానికి గురైనాడు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు విజయనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి ఆ వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చెయ్యడం మొదలుపెట్టారు.

 కరోనా వస్తుందని భయంతో ఆత్మహత్య

కరోనా వస్తుందని భయంతో ఆత్మహత్య

తనకు ఎక్కడ కరోనా వైరస్ పాజిటివ్ అని తెలుస్తుందో ?, నా కుటుంబ సభ్యులు ఎక్కడ నన్ను దూరం పెడుతారో ? అనే ఆవేదనతో చికిత్స పొందుతున్న వ్యక్తి సతమతం అయ్యాడు. వైద్యులు చికిత్స చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించి రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయారు. తరువాత ఆసుపత్రిలోని ఫ్యాన్ కు ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఫ్యామిలీకి షాక్

ఫ్యామిలీకి షాక్

మందులు ఇవ్వడానికి నర్సులు రూమ్ లోకి వెళ్లిన సమయంలో కరోనా వైరస్ సోకిన అనుమానిత రోగి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, బీబీఎంపీ అధికారులు పరిశీలించి ఆయన శవాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

 ఐటీ హబ్ లో కరోనా మరణాల రికార్డ్ బ్రేక్

ఐటీ హబ్ లో కరోనా మరణాల రికార్డ్ బ్రేక్

శుక్రవారం కర్ణాటకలో కరోనా వైరస్ దెబ్బకు 190 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందుకే బెంగళూరులో మాత్రమే 124 మంది కోవిడ్ కు బలికావడంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోతున్నారు. గత 24 గంటల్లో కర్ణాటకలో మొత్తం 26, 962 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో గత 24 గంటల్లో 16, 662 మందికి కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Bengaluru: A 61-year-old COVID- 19 patient died allegedly by suicide by hanging himself from a ceiling fan at Vijaaynagar Hospital last night; body to be shifted to Victoria hospital, say police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X