గాలి ద్వారా కరోనా :ఆ మాస్కులు వద్దు -ఎన్95 లేదా కేఎన్95 మాస్క్లే రక్ష -అంటు వ్యాధుల నిపుణులు
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతోన్న తరుణంలో సాధారణ(బట్టతో చేసిన) మాస్కులు సురక్షితం కాదా? గాలి ద్వారానూ వైరస్ వ్యాప్తి చెందుతోన్నందున కచ్చితంగా మెడికేటెడ్ మాస్కులనే వాడాలా? అంటే అవుననే అంటున్నారు అంటు వ్యాధుల నిపుణులు. కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తున్నదని నిరూపించే అధ్యయనాలను ప్రఖ్యాత సైన్స్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన క్రమంలో వాటిపై ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఫహీమ్ యూనస్ కీలక సూచనలు చేశారు.
కరోనా వైరస్ గాలి ద్వారానూ వ్యాపిస్తోందని అధ్యయనాలు నిరూపిస్తున్నందున, దానికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్లు ధరించడం కంటే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్లు ధరించడమే అని డాక్టర్ ఫహీమ్ యూనస్ సూచించారు. రెండు మాస్క్లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలన్నారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారాయన.

''గాలి ద్వారా కరోనా వ్యాప్తిపై లాన్సెట్ అధ్యయనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ స్పెక్ట్రం (తుంపర్ల నుంచి గాలి ద్వారా)లో వ్యాపిస్తుందని మనకు తెలిసిందే. దీనికి పరిష్కారం.. ఎన్95, ఒక కేఎన్95 మాస్కులు ధరించడమే. వీటిని ఒక్కో రోజు ఒక్కొక్కటి వాడండి. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్లో ఉంచి ఆ మరుసటి రోజు వాడాలి. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవ్చు. బట్టతో చేసిన మాస్క్లు వద్దు'' అని ఫహీమ్ యూనస్ పేర్కొన్నారు.
గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నంత మాత్రాన మన బయట ఉన్న గాలి మొత్తం కలుషితం అయిపోయిందని కాదని, దీనర్థం వైరస్ గాల్లోనే ఉండే అవకాశం ఉన్నదని డాక్టర్ యూనస్ తెలిపారు. ముఖ్యంగా నాలుగు గోడల మధ్య ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఉంటే మన పార్కులు, బీచ్లు మాస్కులు పెట్టుకోకుండా కూడా చాలా సురక్షితం అని యూనస్ చెప్పారు. డాక్టర్ ఫహీమ్ యూనస్ ప్రఖ్యాత మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి డీన్ గా పనిచేస్తున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications