అర్ధరాత్రి మంత్రి కార్యాలయంపై బాంబు దాడి
చెన్నై: తమిళనాడులోని మధురైలో రాష్ట్ర మంత్రి సెల్లూరు కె రాజు కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు మంత్రి కార్యాలయంపై పెట్రోలు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల కాలంలో తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో బాంబు దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితమే మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో పెట్రోలు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి కార్యాలయంపై దాడి జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications