తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..!
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంలో ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణలు చేసి ఫలితాలు ప్రకటించాయి. ఇప్పుడు సీఓటర్ సంస్థ తన తాజా సర్వేలో ఆయా రాష్ట్రాల్లో తాజాగా మారిన పరిస్ధితుల ఆధారంగా మరింత పక్కాగా తన సర్వే ఫలితాలను వెల్లడించింది. సీఓటర్ తాజాగా నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ (opinion poll) ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
సి-వోటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం తమిళనాడులో పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. అధికార డీఎంకే కూటమి 41 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా, దాని తర్వాతి స్థానంలో 38 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కూటమి ఉంది. విజయ్ కొత్త పార్టీ టీవీకేకు అధికారం సంగతి తర్వాత.. కనీస సీట్లు రావడం కూడా కష్టమేనని తేలిపోయింది. పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 44 శాతం ఓట్లతో ముందంజలో కనిపిస్తోంది. బీజేపీకి 40 శాతం దక్కే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

అలాగే అస్సాంలో మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని సీఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చింది. అస్సాంలో, బీజేపీ కూటమి 48 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కూటమి 35శాతం ఓట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. చివరిగా కేరళలో ఈసారి అధికార మార్పిడి తప్పేలా లేదు. అధికార ఎల్డీఎఫ్ కు 36 శాతం ఓట్లు మాత్రమే లభిస్తున్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. విపక్ష యూడీఎఫ్ మాత్రం 40 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
-
విజయ్ కు భారీ షాక్.. నామినేషన్ రిజెక్ట్ -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
తమిళిసై ఓటమి ఖాయమా? గవర్నర్ పదవి వదిలితే ఇదా పరిస్థితి? -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో తేల్చేసిన ఓటర్లు..! -
ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..! -
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!













Click it and Unblock the Notifications