అల్పపీడన గండం- నైరుతి రాకలో మరింత జాప్యం
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్లోనూ జూన్ 1వ తేదీ నాటికి క్రమం తప్పకుండా కేరళ వద్ద తీరాన్ని తాకుతుంటాయి నైరుతి రుతుపవనాలు. నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాల రాకలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీనికి కారణాలు లేకపోలేదు.
అయిదు సంవత్సరాల్లో నమోదైన నైరుతి రుతు పవనాల కదలికలను పరిగణనలోకి తీసుకుంటే- 2018లో మే 29, 2019లో జూన్ 8, 2010లో జూన్ 1, 2022లో జూన్ 3వ తేదీన అవి కేరళ తీరాన్ని తాకాయి. ఇప్పుడు- 5వ తేదీ వచ్చిన వాటి జాడ కనిపించట్లేదు. భారత వాతావరణ కేంద్రం ముందుగా వేసిన అంచనాల ప్రకారం.. ఈ నెల 4వ తేదీ అంటే ఆదివారం నాటికే రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉంది.

ఈ అంచనా తప్పింది. సోమవారం కూడా రుతు పవనాల జాడ కనిపించలేదు. 7వ తేదీ వరకు అవి కేరళ తీరాన్ని తాకకపోవచ్చంటూ వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది. దీని ఫలితంగా- రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఎండ తీవ్రత ఎక్కడే గానీ తగ్గట్లేదు. కేరళ తీరం వైపుగా రుతు పవనాల కదలికలు స్తంభించిపోవడానికి కారణాలను వెల్లడించింది వాతావరణ కేంద్రం.
అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం గగనతలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో 24 గంటల వ్యవధిలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. క్రమంగా ఈ నెల 8 తేదీ తేదీ నాటికి తుఫాన్గా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం రుతు పవనాల కదలికలపై ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఉందని స్పష్టం చేసింది.
ఈ ఉపరితల ఆవర్తనం- వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం క్రమంగా అరేబియా సముద్రం ఉత్తరం వైపునకు తన దిశను మార్చుకుంటుంది. తూర్పు మధ్య భాగంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితులు కేరళ తీరం వైపునకు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎల్నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. రుతు పవనాల రాకలో జాప్యం ఏర్పడటం వల్ల ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులేవీ ఉండట్లేదు. ఈ నెల 7వ తేదీ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలిలో తేమశాతం గణనీయంగా తగ్గడం వల్ల ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications