భారత్ సరిహద్దులో దలైలామా పుట్టినరోజు వేడుకలు: చైనాకు కాలింది, బ్యానర్లతో నిరసన
లడఖ్: ప్రముఖ బౌద్ధ గురువు, టిబెట్కు చెందిన దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరపడంపై చైనా సైనికులు నిరసన తెలిపారు. తూర్పు లడఖ్లోని డెమ్చోక్లో దలైలా పుట్టినరోజు వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. దలైలామాను తమ శుత్రువుగా చూసే చైనాకు ఈ పరిణామం మింగుడు పడలేదు.
ఈ క్రమంలోనే దలైలామా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని నిరసిస్తూ.. సింధు నదిపై వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) దగ్గరలో చైనా సైనికులు బ్యానర్లను ప్రదర్శించారు. చైనా సైనికులు కొందరు తమ దేశ పౌరులతో కలిసి ఐదు వాహనాల్లో వచ్చి కమ్యూనిటీ సెంటర్ నుంచి 200 మీటర్ల దూరంలో బ్యానర్లు ప్రదర్శించారు. దలైలామా పుట్టిన రోజు జరుపుకున్న ప్రాంతానికి సమీపంలోనే బ్యానర్లతో నిరసన తెలిపారు.

సింధునది పక్కనే ఉన్న కోయల్ గ్రామంలోని డోలా తమ్గో వద్ద జులై 6న ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా మాండరిన్లో బ్యానర్లు ప్రదర్శించడంతో ఏం రాశారో అర్థం కాలేదని అక్కడి భారతీయులు తెలిపారు. దాదాపు అరగంటసేపు నిరసన తెలిపిన చైనా సైనికులు ఆ తర్వాత వెళ్లిపోయారు. డెమ్చోక్ ప్రాంతం భారత భూభాగం కాగా, తమదేనంటూ చైనా వాదిస్తోంది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్కు చెందినదని
చెబుతోంది. దీంతో ఈ ప్రాంతం వివాదాస్పదంగా మారింది.
కాగా, దలైలామా 86వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీని దలైలామా కలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు తెలిపారు. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత దలైలామా ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందని చెప్పారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications