వాచీ ధరించినందుకు దళితుడి మణికట్టు నరికేశారు
మదురై: తమిళనాడులోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గడియారం పెట్టుకున్నందుకు పాఠశాలలో బుధవారం రాత్రి ఓ దళిత బాలుడి మణికట్టును నరికేశారు. గ్రామంలోని దళితేతర సీనియర్ విద్యార్థులు ఆ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
పరంజోతి కుమారుడు రమేష్ అనే 16 ఏళ్ల బాలుడు విరుద్ధునగర్ జిల్లా తిరుతంగళ్లోని తిరువల్లువూరు కాలనీలో ఉంటున్నాడు. తిరుంగళ్లోని ప్రభుత్వ బాలుర ఉన్న మాధ్యమిక పాఠశాలలో ప్లస్ వన్ చదువుతున్నాడు.
సోమవారంనాడు వాచీ ధరించిన రమేష్ను చూసి సీనియర్లు ఆ విషయం అడిగారు. తొలుత గడియారం తీసి విసిరేశారు. దానిపై బాలుడు గొడవకు దిగాడు. దీంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి రమేష్ తిరతనంగళ్ రైల్వే స్టేషన్ వద్ద నడుస్తుండగా దాదాపు 15 మంది బాలురతో కూడిన ముఠా అడ్డుకుని అతని మణికట్టును నరికేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
వారి నుంచి తప్పించుకున్న బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో అతను చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.