కత్తితో బెదిరించి, రేప్ చేయబోతే మర్మాంగాలు కోసేసింది
మీరట్: తన పైన అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తి మర్మాంగాలను కోసివేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో గురువారం సాయంత్రం జరిగింది. అమ్మాయి వయస్సు 17. ఆమె నిందితుడు నుంచి కత్తి లాక్కొని, బెదిరించి ఎదురు తిరిగింది.
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. ఇంచోలీ ప్రాంతంలో అడవిలోకి దళిత బాలిక వెళ్లింది. ఆమె ఒక్కతే రావడం గమనించిన రాయిస్ అనే యువకుడు ఆమె పైన అత్యాచారానికి ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న కత్తితో ఆ బాలికను బెదిరించి, లొంగదీసుకోవాలనుకున్నాడు.
ఒక్కసారిగా షాకైన బాలిక ఆ తర్వాత తేరుకుంది. అతని చేతిలోని కత్తిని ఆమె లాక్కుంది. అంతే, అదే వేగంతో అతని మర్మాంగాలు కోసివేసింది. అతని అరుపులు విని సమీప గ్రామస్తులు వచ్చి, ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువురు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో పోలీసు బందోబస్తు ఉంచారు.