వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృశ్యం: మురికి కాలువలో శవమై తేలిన విద్యార్థిని (వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఓ విద్యార్థిని మురికికాలువలో శవమై కనిపించింది. ఫిబ్రవరి 10వ తేదీన రాణిలక్ష్మీభాయి కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ఉన్నతి విశ్వకర్మ అనే విద్యార్థిని కనిపించకుండా పోయింది.

ఈ మేరకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఫోన్‌ ట్రాక్‌ చేయగా ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ దగ్గర ఫోన్‌ దొరికింది. అతడిని విచారించగా తనకు ఆ ఫోన్‌ ఓ చోట దొరికిందని చెప్పాడు.

ఆ తర్వాత అదే ప్రాంతంలో గాలింపు చేపట్టగా సోమవారం విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. కాగా, ఈ ప్రాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసానికి కొద్ది దూరంలోనే ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మొదట విద్యార్థిని డ్రైనేజీలో శవమై తేలిందని వార్తలు వెలువడగా, ఆ తర్వాత పోలీసులు చెట్టుకు వేలాడుతూ ఆమె మృతదేహం లభించిందని తెలిపారు.

English summary
The body of a Class 12 girl student was recovered from a drain on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X