శుభవార్త! ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు, సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం!
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాలలో లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని, అయితే, ప్రజల సౌకర్యార్థం అనుసంధానానికి గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పొడిగిస్తున్నామని మోడీ సర్కారు బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
అంతకుముందు ఆధార్ అనుసంధానంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ లతో కూడిన ధర్మాసనం ముందు కేంద్రం తన వాదన వినిపిస్తూ, సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా చూడటమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.

అనుసంధానం గడువును మూడు నెలలు పొడిగిస్తున్నట్టు చెప్పడంతో, ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావించిన ధర్మాసనం, అన్ని పిటిషన్లపైనా నవంబర్ తొలి వారంలో విచారణ ప్రారంభిస్తామని చెబుతూ, కేసును వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications