శ్రీదేవి మృతిలో కుట్ర!: దుబాయ్ పోలీసులు ఏం చెప్పారంటే, రేపు అంత్యక్రియలు
Recommended Video
దుబాయ్: నటి శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు సోమవారం మాట్లాడారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని పోలీసులు వెల్లడించారు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని చెప్పారు. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
బాత్రూంలోనే శ్రీదేవి.. విషాదం ఇలా!: అతిలోక సుందరి గురించి కొన్ని విషయాలు...
దుబాయ్ పోలీసులకు శ్రీదేవి ఫోరెన్సిక్ రిపోర్ట్ అందింది. శ్రీదేవి మరణ ధ్రవీకరణ పత్రం మధ్యాహ్నం సమయంలో జారీ అయింది. దీంతో ఆమె భౌతికకాయాన్ని భారత్ తరలించేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి కాలేదంటూ
అంతకుముందు, శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఆదివారం నుంచి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి కాలేదంటూ దుబాయ్ వైద్యులు ఆలస్యం చేశారు.
తుది నివేదిక రూపొందించాకే
శ్రీదేవి భౌతిక కాయాన్ని అప్పుడే అప్పగించమని ఆమె కుటుంబ సభ్యులకు దుబాయ్ పోలీసులు తెలిపారు. తాము తుది నివేదిక రూపొందించాకే అప్పగిస్తామని తేల్చి చెప్పారు. శ్రీదేవి భౌతికకాయం తరలింపు ఏర్పాట్లను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది.
రెండోసారి పరీక్ష అవసరం లేదని
శ్రీదేవి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష అవసరం లేదని ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. శ్రీదేవికి రేపు అంత్యక్రియ నిర్వహించనున్నారు. ఆమెకు చెందిన భాగ్య బంగాల్లో అభిమానుల కోసం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. రాత్రి పది గంటల సమయంలో మృతదేహం ముంబైకి చేరుకోనుంది. ముంబైలోని ఆమె ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్
ఫోరెన్సిక్ రిపోర్టును బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ పంపించారు. అలాగే, ప్రతినిధులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఈ విషయాలను వెల్లడిస్తారని స్థానిక పత్రికలు అంతకుముందు వెళ్లడించాయి.
హోటల్లోనే ప్రాణం విడిచారని మరిది
అంతకుముందే, శ్రీదేవి దుబాయ్లో బస చేసిన హోటల్లోనే ప్రాణం విడిచారని ఆమె మరిది, బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమెకు గుండె సంబంధిత జబ్బులేమీ లేవని, అయినా ఇలా జరగడంతో మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యామని, కుటుంబం యావత్తూ ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతోందన్నారు.