పన్నీర్ సెల్వంకు ఇక సీఎం చాన్స్ లేదు: మాజీ అటార్నీ జనరల్
చెనై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని వాయిదా వేస్తూ తమిళనాడు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయం సరైనదేనని మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావును తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలను గవర్నర్ విద్యాసాగర్ రావు అతిక్రమించలేదని మాజీ అటార్నీ జనరల్ సోరాబ్జీ బుధవారం మీడియాకు చెప్పారు.

గవర్నర్ రాజీనామా ఆమోదించిన తరువాత పన్నీర్ సెల్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదని మాజీ అటార్నీ జనరల్ సోరాబ్జీ స్పష్టం చెయ్యడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళనకు గురైనారు. అయితే మేము గవర్నర్ ను కలిసి ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయనకు వివరిస్తామని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు రాకుండా శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చెయ్యడానికి అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్దం అయిన సమయంలో మాజీ అటార్నీ జనరల్ ఆ పార్టీ నాయకులు ఈ విధంగా ఝలక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications