అక్రమ రవాణా: 16మంది యువతులకు విముక్తి కల్పించిన డీసీడబ్ల్యూ
న్యూఢిల్లీ: అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 16 మంది యువతులను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్య్లూ) కాపాడింది. పోలీసుల సాయంతో ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా దాడులు జరిపి వీరిని కాపాడింది.
నేపాల్ నుంచి వీరందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇరాక్, కువైట్ తరలించేందుకు ఉంచగా తాము రక్షించామని డీసీడబ్ల్యూ ఛైర్మన్ స్వాతి మలివాల్ తెలిపారు. బాధిత యువతుల నుంచి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్న అక్రమార్కులు వారిని ఓ చిన్న గదిలో బంధించారని చెప్పారు.
गुमराह कर मानव तस्कर 16 नेपाली लड़की दिल्ली लाये & उन्हें चुपके से कुवैत व इराक भेज रहे थे। उनके पासपोर्ट दलालो ने छीन लिए। छोटे से कमरे में बंद 16 लड़की आज रात हमने छुड़वाई। 8 महीने से ये चल रहा है, 7 लड़कियां कुवैत & इराक 15 दिन पहले भेजी गयी हैं। उनके साथ जाने क्या हुआ होगा! https://t.co/vx8jvJS9rD
— Swati Maliwal (@SwatiJaiHind) July 24, 2018
అక్కడ్నుంచి తాము రక్షించామని స్వాతి మలివాల్ తెలిపారు. గత 8 నెలలుగా యువతుల అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోందని, 15 రోజుల క్రితం ఏడుగురు మహిళలను కువైట్ తరలించారని చెప్పారు. కాగా, ఢిల్లీలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే లెఫ్ట్నెట్ గవర్నర్, పోలీసులు, కేంద్రం ఏం చేస్తోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.