Delhi Exit Polls: ఆప్ ను తక్కువగా అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
Delhi Exit Polls: ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఈ సారి ఢిల్లీలో అధికార మార్పు జరుగుతుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం.. ఢిల్లీలో బీజేపీ, ఆప్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంటుందని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం ఆప్ 32-37 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 35-40 సీట్లతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఒక సీటును సాధిస్తుందని కూడా ఆ సర్వే తెలిపింది. చాలా వరకు సర్వేలన్నీ బీజేపీకి పట్టం కట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెబుతున్నాయని.. కానీ ఆప్ ను తక్కువగా అంచనా వేస్తున్నాయని తనకు అనిపించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరు ఇంత దారుణంగా ఉంటుందని తాను అనుకోనన్నారు. ఎగ్జిట్ పోల్స్ తో నిరాశ చెందానని సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. దానికి కారణం ఏంటంటే.. కాంగ్రెస్ కు 17-18 శాతం ఓట్లు సులభంగా వస్తున్నాయని తాను భావించానన్నారు. కాంగ్రెస్ ఆ ఓట్లను పొందలేకపోయిందా లేక అంత బలహీనంగా ఉన్నామా అనేది చూడాలన్నారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు మాత్రమే నిజమవుతాయని, కొన్ని సార్లు తప్పు కావచ్చని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయని తాను అనుకోనన్నారు. ఓటింగ్ శాతం అంత ఎక్కువగా లేదని.. ఫలితాలు వచ్చిన తర్వాతే అంతా మనకు స్పష్టమవుతుందన్నారు. ఫిబ్రవరి 8న మనకు అసలు విషయం తెలుస్తుందన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాల చిత్రాన్ని ఇస్తాయి. నిజానికి ఎగ్జిట్ పోల్లో ఒక సర్వే నిర్వహించబడుతుంది. దీనిలో ఓటర్లను అనేక ప్రశ్నలు అడుగుతారు. ఎవరికి ఓటు వేశారని అడుగుతారు. ఈ సర్వేను పోలింగ్ రోజున నిర్వహిస్తారు. సర్వే ఏజెన్సీల బృందం పోలింగ్ కేంద్రం బయట ఓటర్లను ప్రశ్నిస్తుంది. దీనిని విశ్లేషించి దీని ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తారు. భారతదేశంలో చాలా ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి.
ఢిల్లీలో ఏ సీట్లపై అందరి దృష్టి ఉంది?
ఢిల్లీ ఎన్నికల్లో చాలా సీట్లు ఉన్నాయి. వాటి ఫలితాలపై అందరూ దృష్టి సారిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, అతిషి, పర్వేశ్ వర్మ, రమేష్ బిధురి, కైలాష్ గెహ్లాట్ వంటి ప్రముఖ నాయకులు రేసులో ఉన్నారు. న్యూఢిల్లీ సీటు విషయంలో అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పోటీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మధ్య ఉంది. పట్పర్ గంజ్ స్థానంలో ఆప్ నుంచి అవధ్ ఓజా, బీజేపీ నుంచి రవీందర్ సింగ్ నేగి, కాంగ్రెస్ నుంచి అనిల్ చౌదరి మధ్య పోటీ నెలకొంది. రోహిణి సీటులో ఆప్ నుంచి ప్రదీప్, బీజేపీ నుంచి విజేంద్ర గుప్తా మధ్య హోరాహోరీ ఉండనుంది. కల్కాజీ సీటులో ఢిల్లీ ప్రస్తుత సీఎం అతిషి, మాజీ బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. జంగ్పురా స్థానంలో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్విందర్ సింగ్ మార్వా, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి బరిలో ఉన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications