వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 శాతం స్పెషల్ కరోనా ఫీ, నేటి నుంచి అమలు.. మందుబాబులకు ఆప్ సర్కార్ షాక్

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది. దాదాపు 40 రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరిచి ఉండటంతో మందుబాబుల ఆనందానికి అవధి లేకుండా పోయింది. అయితే వారి సంతోషంపై ఢిల్లీ సర్కార్ నీళ్లు చల్లింది. హస్తినలో లిక్కర్ ఎంఆర్పీపై 70 శాతం స్పెషల్ కరోనా ఫీను ముక్కుపిండి మరీ వసూల్ చేస్తోంది. కరోనా ఫీ మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం స్పస్టంచేసింది.

 Delhi Govt to Impose 70% Special Corona Fee on Liquor

కరోనా పీతో రెవెన్యూ పెరుగుతోందని.. దీంతో సంక్షేమ పథకాల కోసం నగదు వెచ్చించొచ్చని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కరోనా పీకి సంబంధించి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నిరకాల మద్యంపై 70 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తామని తెలియజేసింది. ఉదహరణకు మందు బాటిల్ రూ.1000 ఉంటే దాని రూ.1700కు లభించనుంది.

Recommended Video

Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral

మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన తొలిరోజున ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కంటోన్మెంట్ జోన్లలో లేని 150 మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల సీఎం కేజ్రీవాల్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కరోనా పీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగున గల హర్యానా కూడా కోవిడ్ సెస్ వేయాలని భావిస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలో పన్నుల ద్వారా 3500 కోట్లు రాగా.. ఈ ఏడాది 300 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెవెన్యూ మార్గాలపై కేజ్రీవాల్ సర్కార్ ఫోకస్ చేసింది. అయితే వైన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించకుంటే మూసివేస్తామని స్పష్టంచేశారు.

English summary
Liquor in Delhi will cost more from Tuesday after the government decided to impose a 70% 'Special Corona Fee' on its sale in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X