పరస్పర సమ్మతంతో గర్భవతి అయితే-20 వారాలయ్యాక నో అబార్షన్ - ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
మన దేశంలో అవాంఛిత గర్భధారణలు, గర్భాల తొలగింపులు విచ్చలవిడిగా సాగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఓ సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా అవివాహిత యువతులు తమ ఇష్టానుసారంగా గర్భాన్ని ధరించి అలాగే తొలగించుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు వాటికి బ్రేక్ వేసింది.
పరస్పర సమ్మతంతో ఓ యువకుడితో సెక్స్ లో పాల్గొని గర్భవతి అయిన ఓ అవివాహిత యువతి 23 వారాల తర్వాత తాను గర్భాన్ని తొలగించుకునేందుకు (అబార్షన్ )కు అనుమతివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. అదేమీ కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. అసలు 20 వారాల తర్వాత అబార్షన్లు చేయించుకోవడం కుదరదని తేల్చిచెప్పేసింది.
మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నిబంధనల ప్రకారం అంగీకార లైంగిక సంబంధం ద్వారా బిడ్డను కన్న అవివాహిత మహిళకు 20 వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న గర్భాన్ని తొలగించడానికి అనుమతి లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. పిటిషనర్, అవివాహిత మహిళ, ఏకాభిప్రాయ సంబంధం నుంచి గర్భం దాల్చిందని, 2003లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ కింద ఎటువంటి క్లాజులు స్పష్టంగా లేవు.
కాబట్టి, సెక్షన్ 3(2)(బి) ఈ కేసు వాస్తవాలకు చట్టం వర్తించదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ రోజు నాటికి, ఎంటీపీ నిబంధనల యొక్క రూల్ 3B అమలవుతుందని, అవివాహిత మహిళ 20 వారాలకు మించి గర్భం దాల్చడానికి అనుమతించదని, అందువల్ల, న్యాయస్థానం చట్టాన్ని దాటి వెళ్లదని పేర్కొంది.