ఢిల్లీ అల్లర్ల కేసులో JNU విద్యార్ది నేత ఉమర్ ఖాలీద్ కు మరో షాక్-హైకోర్టు బెయిల్ నిరాకరణ
రెండేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ అలర్ల కేసులో జేఎన్యూ విద్యార్ధి సంఘం నేత ఉమర్ ఖాలిద్ కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఖాలిద్ పాత్రపై ఆధారాలున్నాయంటూ పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్న క్రమంలో ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్ధానం తోసిపుచ్చింది.
2020లో ఢిల్లీలోని ముజఫర్ నగర్ లో అల్లర్లు సృష్టించేందుకు పథక రచన చేశారన్న ఆరోపణలతో ఉమర్ ఖాలిద్ ను అదే ఏడాది సెప్టెంబర్లో ఉపా కేసు కింద అరెస్టు చేశారు. అయితే ఈ అల్లర్లతో తన పాత్ర లేదని, పథక రచన చేశాననేందుకు ఆధారాలు లేవని ఉమర్ ఖాలిద్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. ఉమర్ ఖాలిద్ పాత్రపై ఆధారాలున్నాయన్నారు. దీంతో ఏకీభవించిన న్యాయస్దానం ఖాలిద్ బెయిల్ అభ్యర్దనలో ఎలాంటి మెరిట్ లేదంటూ తోసిపుచ్చింది.

ఢిల్లీలో 2020లో జరిగిన ముజఫర్ నగర్ అల్లర్లలో 53 మంది చనిపోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్ల వెనుక ఉమర్ ఖాలిద్ తో పాటు షర్జీల్ ఇమామ్, ఇతరుల పాత్ర ఉందని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వీరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నా ఊరట దక్కలేదు. దీంతో ఈసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయినా పోలీసులు సమర్పించిన ఆధారాలను కోర్టు విశ్వసించి బెయిల్ తిరస్కరించింది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications