Delhi riots: మూడు కోర్టుల్లో హైడ్రామా -విద్యార్థి నేతల విడుదలకు ఉత్తర్వులు -సుప్రీంకు ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు విద్యార్థి నేతల విడుదలపై మూడు కోర్టుల్లో హైడ్రామా నడిచింది. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడం దేశద్రోహం కాబోదంటూ ఢిల్లీ హైకోర్టు.. నటాషా నర్వాల్, దేవాంగన కలితా (జేఎన్యూ), అసిఫ్ ఇక్బాల్ తన్హా (జామియా మిలియా ఇస్లామియా) లకు మంగళవారం బెయిల్ ఇవ్వగా, ట్రయల్ కోర్టు కొర్రీలతో హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. తమ విడుదల విషయంలో పోలీసులు కావాలనే తాత్సారం చేస్తున్నారంటూ విద్యార్థి నేతలు మళ్ళీ హైకోర్టును ఆశ్రయిచండంతో ట్రయల్ కోర్టు దిగిరాక తప్పలేదు.
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన నటాషా నర్వాల్, దేవాంగన కలితా, అసిఫ్ ఇక్బాల్ తన్హాల విడుదలపై ట్రయల్ కోర్టు జడ్జి రవీంద్ర బేడీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆ ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో ఆ ముగ్గురూ ఇంకాసేపట్లో విడుదల కానున్నారు. అంతకుముందు..

బెయిల్ పొంది 2 రోజులైనా తమ విడుదలకు ఆటంకాలొస్తున్నాయంటూ విద్యార్థి నేతలు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు జాప్యాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గర్హించింది. విద్యార్థుల్ని త్వరితగతిన విడుదల చేయాలని సూచించింది. మరోవైపు, నటాషా నర్వాల్, దేవాంగన కలితా, అసిఫ్ ఇక్బాల్ తన్హాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో మరో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
ముగ్గురు విద్యార్థి నేతలు బెయిల్ పొందేందుకు అనర్హులని, ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వారి రిమాండ్ తప్పనిసరని, హైకోర్టు కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని ఢిల్లీ పోలీసులు సుప్రీంను వేడుకున్నారు. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు త్వరలోనే పరిశీలించనుంది. మొత్తంగా ముగ్గురు విద్యార్థి నేతల విడుదల అంశంపై ట్రయల్(సెషన్స్) కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications