తోడుంటానని మాటిచ్చి మట్టుబెట్టిన భర్త .. భార్యతోపాటు పిల్లలు కూడా ...
న్యూఢిల్లీ : మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవడమో ? లేక సైకోగా మారి కొందరు తమవారిపై దాడిచేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ట్యూటర్ కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు. తన భార్య, పిల్లలను హతమార్చి పోలీసులకు లొంగిపోయాడు.
ఎంత పనిచేశాడు ...?
దక్షిణ ఢిల్లీలోని మెహ్రోలిలో ఉపేంద్ర శుక్లా అనే వ్యక్తి ట్యూటర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇన్నాళ్లూ బాగానే ఉన్నారు. కానీ అతడిలో ఏం జరిగిందో తెలియదు కానీ .. భార్య, పిల్లలను మట్టుబెట్టాడు. తన భార్య, పిల్లల గొంతుకోసి హతమార్చాడు. వీరిలో రెండు నెలల పాప కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. తెల్లవారినా వారు గది నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే అత్తయ్య తలుపు కొట్టింది. అయినా చడీ చప్పుడు లేకపోవడంతో తలుపును బద్దలుకొట్టారు. అయితే తన కోడలు, మనమరాళ్లు విగతజీవిగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్నకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

నిందితుడు అరెస్ట్ ..
వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు .. శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరం చేసినట్టు అంగీకరించాడు శుక్లా. అయితే ఎందుకు హత్య చేశావని అడిగితే మాత్రం క్లారిటీ లేదు. అయితే అతను కొంతకాలం నుంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యులకు చూపించి .. నిర్ధారించుకుంటామని పోలీసులు తెలిపారు. మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించి .. బంధువులకు అప్పగించారు. శుక్లా ఎందుకీలా చేశాడో అర్థం కావడం లేదని స్తానికులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications