కిడ్నాప్: ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై ఘజియాబాద్లో రేప్
ఘజియాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లోని కవినగర్లో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బికాం చదువుతున్న సదరు విద్యార్థిని డిగ్రీ ఫలితాలు విడుదల కావడంతో సైబర్ కేఫ్కు వెళ్లి ఫలితాలను చూసుకుంది. ఆ తర్వాత ఇంటికి తిరుగుపయనమైన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతిని సచిన్, లలిత్ అనే ఇద్దరు యువకులు కవినగర్లోని రాజాపూర్ ప్రాంతంలో వారింటికి తీసుకెళ్లారు. అక్కడే లలిత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
కాగా, ఇంటికి చేరుకున్న బాధిత యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు లలిత్ను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న సచిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications