వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్: ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై ఘజియాబాద్‌లో రేప్

|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లోని కవినగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బికాం చదువుతున్న సదరు విద్యార్థిని డిగ్రీ ఫలితాలు విడుదల కావడంతో సైబర్ కేఫ్‌కు వెళ్లి ఫలితాలను చూసుకుంది. ఆ తర్వాత ఇంటికి తిరుగుపయనమైన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Delhi University Student Allegedly Raped in Ghaziabad

పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతిని సచిన్, లలిత్ అనే ఇద్దరు యువకులు కవినగర్‌లోని రాజాపూర్ ప్రాంతంలో వారింటికి తీసుకెళ్లారు. అక్కడే లలిత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.

కాగా, ఇంటికి చేరుకున్న బాధిత యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు లలిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న సచిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
A Delhi University student was allegedly raped by one person this morning in Kavi Nagar in Ghaziabad, following which the accused has been arrested, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X