ఢిల్లీ యూనివర్సిటీ వీసీపై రాష్ట్రపతి సస్పెన్షన్... నియామకాల వివాదం.. ఆధిపత్య పోరు...
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వేటు వేశారు. త్యాగిని రాష్ట్రపతి సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం(అక్టోబర్ 28) వెల్లడించారు. వర్సిటీలో ఇటీవలి కీలక నియామకాలకు సంబంధించి వీసీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విద్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై విచారణకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు లేఖ రాసిన నేపథ్యంలో వీసీ సస్పెన్షన్కు గురయ్యారు.

విచారణ పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్
వీసీ సస్పెన్షన్కు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు లేఖ రాసింది. వీసీ యోగేష్ త్యాగిపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంతవరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని అందులో పేర్కొంది. త్యాగి విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. యూనివర్సిటీ తాత్కాలిక వైస్ ఛాన్సలర్గా పీసీ జోషీ బాధ్యతలు చేపడుతారని తెలిపింది.

నియామకాలపై తలెత్తిన వివాదం...
వీసీ యోగేష్ త్యాగి జులై 2న అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ప్రభుత్వం పీసీ జోషికి జులై 17న ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. యోగేష్ త్యాగి తిరిగి విధుల్లో చేరేంతవరకు ఆయన ఇన్చార్జిగా కొనసాగుతారని పేర్కొంది. ఇదే క్రమంలో గత వారం వీసీ యోగేష్ త్యాగి.. ఇన్చార్జిగా పీసీ జోషిని తప్పించి ఆయన స్థానంలో నాన్-కాలేజియేట్ విమెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు యూనివర్సిటీ డైరెక్టర్ గీతా భట్ను నియమించారు.అదే సమయంలో గత బుధవారం పీసీ జోషి కొత్త రిజిస్ట్రార్గా వికాస్ గుప్తా నియామకాన్ని నోటిఫై చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఆయన నియామకాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు వీసీ యోగేష్ త్యాగి యాక్టింగ్ రిజిస్ట్రార్గా పీసీ ఝా నియామకాన్ని నోటిఫై చేశారు.

ఆ నియామకాలు చెల్లవని...
వీసీ తనను యాక్టింగ్ రిజిస్ట్రార్గా నోటిఫై చేశారని... యూనివర్సిటీ నియమ నిబంధనల మేరకే తన నియామకం జరిగిందని పీసీ ఝా విద్యా మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. వీసీ,ఇన్చార్జి వీసీ మధ్య నియామకాల విషయంలో తలెత్తిన వివాదాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించి రాష్ట్రపతికి లేఖ రాసింది. యోగేష్ త్యాగి చేపట్టిన నియామకాలు చెల్లవని,ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లేఖలో పేర్కొంది. ఆయనపై విచారణకు అనుమతినివ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వీసీ త్యాగిపై వేటు వేసి విచారణకు అనుమతినిచ్చారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications