అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రి
ఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్కు తిరిగి వచ్చారు. అమెరికాలో ఆయన దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొందారు. తన తొడభాగంలో టిష్యూ కేన్సర్ రావడంతో చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. ఇదిలా ఉంటే భారత్కు తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందంటూ అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే గతేడాది ఏప్రిల్లో అనారోగ్యంతో జైట్లీ ఎయిమ్స్లో చేరారు. అనంతరం ఆయన డయాలసిస్ చేయించుకున్నారు. మే 14, 2018న రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగింది. ఇక అప్పటి నుంచి తన బాధ్యతలకు కాస్త దూరంగా ఉంటున్నారు జైట్లీ. జైట్లీ అమెరికాకు వెళ్లిపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి బాద్యతలను పీయుష్ గోయల్ తీసుకున్నారు. ఫిబ్రవరి 1న పీయూష్ గోయలే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉన్నప్పటికీ జైట్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకునేవారు.

ఈ మధ్యనే ఓ వార్తా సంస్థ జైట్లీ ఆరోగ్యం మెరుగుపడుతోందంటూ కథనం రాసింది. అంతేకాదు పార్లమెంటు సమావేశాలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అది డాక్టరు సలహా మేరకే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. గతనెలలోనే జైట్లీకి మరో ఆరోగ్య సమస్య తలెత్తడంతో అమెరికాకు వెళ్లారు. సర్జరీ అనంతరం కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న ఆయన తిరిగి భారత్ చేరుకున్నారు.
-
Iran War: సీజ్ ఫైర్ పై తేల్చేసిన ఇరాన్..! ట్రంప్ కు ఘాటు కౌంటర్..! -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications