కర్ణాటక చరిత్రలోనే లేదు: అసెంబ్లీలో 200 మంది మార్షల్స్, తోక తిప్పితే సినిమా చూపిస్తారు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకుంటున్న సందర్బంలో కర్ణాటక చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 200 మందికి పైగా మార్షల్స్ ను అసెంబ్లీలో మొహరించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ శాసన సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు, ఆందోళనలు జరగకుండా చూడటానికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆందోళన చేసి గందరగోళం సృష్టించాలని తోక తిప్పితే సినిమా చూపించడానికి రంగం సిద్దం చేశారు. 221 మంది ఎమ్మెల్యేలకు అంతే సంఖ్యలో మార్షల్స్ ను రంగంలోకి దింపి జాగ్రత్తలు తీసుకున్నారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు మాకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ సందర్బంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సందర్బంగా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు 200 మందికి పైగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు.

సీఎం యడ్యూరప్ప
ముఖ్యమంత్రిగా ఈనెల 17వ తేదీ ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప 15 రోజుల్లో తన మెజారిటీ శాసన సభ్యులను అసెంబ్లీలో నిరూపించుకుంటానని చెప్పారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

సుప్రీం కోర్టు ఆదేశం
బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యులను నిరూపించుకోవడానికి 15 రోజులు అవకాశం ఇవ్వడం కుదరదని శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్షలో సీఎం మెజారిటీ శాసన సభ్యులను నిరూపించుకోవాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్యేలకు భద్రత
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని కర్ణాటక డీజీపీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

విదాన సౌధ పరిసరాల్లో 144 సెక్షన్
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతు కూడగట్టుకుంటున్న సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విదాన సౌధ పరిసర ప్రాంతాల్లోని కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ విదించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications