వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ ధరల రోజూవారీ సమీక్ష కొనసాగుతోంది:మంత్రి

పెట్రోల్‌, డీజిల్‌పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుల లబ్ధి దృష్ట్యా ఈ విధానంలో మార్పు చేసే అవసరం లేదని వ్యాఖ్యానించారు.

రోజువారీ ధరల విధానం బాగుందని ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. జూన్‌ 16 తర్వాత తొలిసారి ధరలు తగ్గుముఖం పట్టాయని, ఆ తర్వాత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వాటి ధరలు క్రమంగా పెరిగాయన్నారు.

Dharmendra Pradhan says daily petrol, diesel price revision to continue

ఒకవేళ అంతర్జాతీయంగా రేట్లు తగ్గితే వాటి ప్రయోజనాలు వెంటనే వినియోగదారులకు బదిలీ అవుతాయని పేర్కొన్నారు. అందుకోసం 15 రోజుల పాటు నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు.

గతంలో 15 రోజులకోసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరించేవి. జూన్‌ 16 తర్వాత రోజువారీ ధరల విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటి ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. ఇప్పటివరకూ పెట్రోల్‌పై రూ.6.6, డీజిల్‌పై రూ.4.02 వరకు ధర పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల హోండెలివరీ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

English summary
Oil Minister Dharmendra Pradhan today said the daily revision in petrol and diesel prices will continue despite petrol price spiking by Rs 6.6 per litre in two months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X