పెట్రోల్ ధరల రోజూవారీ సమీక్ష కొనసాగుతోంది:మంత్రి
పెట్రోల్, డీజిల్పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై రోజువారీ ధరల సమీక్ష విధానం కొనసాగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుల లబ్ధి దృష్ట్యా ఈ విధానంలో మార్పు చేసే అవసరం లేదని వ్యాఖ్యానించారు.
రోజువారీ ధరల విధానం బాగుందని ప్రధాన్ అభిప్రాయపడ్డారు. జూన్ 16 తర్వాత తొలిసారి ధరలు తగ్గుముఖం పట్టాయని, ఆ తర్వాత అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వాటి ధరలు క్రమంగా పెరిగాయన్నారు.

ఒకవేళ అంతర్జాతీయంగా రేట్లు తగ్గితే వాటి ప్రయోజనాలు వెంటనే వినియోగదారులకు బదిలీ అవుతాయని పేర్కొన్నారు. అందుకోసం 15 రోజుల పాటు నిరీక్షించాల్సిన అవసరం లేదన్నారు.
గతంలో 15 రోజులకోసారి ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించేవి. జూన్ 16 తర్వాత రోజువారీ ధరల విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటి ధరలు నిరంతరం పెరుగుతూ వచ్చాయి. ఇప్పటివరకూ పెట్రోల్పై రూ.6.6, డీజిల్పై రూ.4.02 వరకు ధర పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల హోండెలివరీ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications