వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమత ఔట్ -పరివర్తన్ ఇన్: మే2న జరిగేదిదే -అంపన్ తుపాను సాయం బొక్కేశారు -బెంగాల్ ర్యాలీలో మోదీ ఫైర్

|
Google Oneindia TeluguNews

గడిచిన 10 ఏళ్లుగా బెంగాల్ అభివృద్దిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనం జీవితాలతో ఆటలాడుకున్నారని, అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లోనూ టీఎంసీ 'ఖేలా హోబే(ఆట కొనసాగుతోందని)' నినాదమిచ్చిందని, అయితే, బెంగాలీలు మాత్రం దీదీ ఆటకట్టించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారిఅబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం కోసం బుధవారం పూరబ్ మెదినిపూర్ జిల్లాకు వచ్చిన ప్రధాని మోదీ.. కాంతి సిటీలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దీదీని ఇంటికి సాగనంపేందుకు బెంగాలీ మహిళలు ఇప్పటికే సిద్ధమయ్యారని, మే 2నాటి ఎన్నికల ఫలితాలతో దీదీ నిష్క్రమణ, పరివర్తన్(మార్పు) ఆగమనం ఏక కాలంలో జరుగుతాయని మోదీ చెప్పారు.

Didi out, Poriborton in, Bangla chai- BJP sarkar says PM Modi targets Mamata at Contai rally

గడిచిన 10ఏళ్ల పాలనలో దీదీ తన అసలు రూపాన్ని చాలాసార్లు బయటపెట్టుకున్నారని, అల్లుడి(అభిషేక్ బెనర్జీ) అవినీతి సామ్రాజ్యానికి అన్ని రకాలుగా సాయడ్డారని, చివరికి అంపన్ తుపాను బాధితుల కోసం కేంద్రం భారీ సహాయాన్ని ప్రకటిస్తే ఆ మొత్తాన్ని కూడా అత్తాఅల్లుళ్లు బొక్కేశారని ప్రధాని ఆరోపించారు. టీఎంసీ సర్కార్ వసూళ్లకు కూడా పాల్పడిందని మోదీ విమర్శించారు.

''అంపన్ తుపాను విలయంలో వేలాది మంది బెంగాలీలు విలవిల్లాడారు. గూడు కోల్పోయి గజగజా వణికిపోయారు. వారికి సహాయంగా కేంద్రం పంపిన మొత్తమంతా దీదీ మేనల్లుడి ఇంట్లో అటకాయించిపోయింది. ఇలా టీఎంసీ వాళ్లు ప్రజల జీవితాలో ఆటలాడుకుంటున్నారు. ఈ విషయం బెంగాల్ లోని చిన్నపిల్లకు కూడా అర్థమైపోయింది. అందుకే దీదీని సాగనంపాలని జనం డిసైడైపోయారు'' అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా,

 ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ 'ఖేలా హుబే' నినాదంతో ప్రచారంలో దూసుకెళుతుండగా, దానికి కౌంటర్ గా బీజేపీ నినాదాన్ని ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. 'బంగ్లా చాయి -బీజేపీ సర్కార్' (బెంగాల్ కోరుతోంది బీజేపీ ప్రభుత్వాన్ని) అంటూ మోదీ కొత్త నినాదం ఇవ్వగా జనం కేరింతలు కొట్టారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ మార్చి 27న జరుగనుంది.

English summary
Prime Minister Narendra Modi on Wednesday said in West Bengal that Asol Poriborton will usher in the state on May 2 when the people will show the door to Didi (Chief Minister Mamata Banerjee). Addressing a rally in Kanthi (Contai), the PM told the crowd that Asol Poriborton is the need of the hour in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X