టాయిలెట్లు కంపుకొడుతున్నాయని 70శాతం మంది ప్రయణాలను వాయిదావేసుకొంటున్నారు
దేశంలోని ప్రధాన నగరాల్లో మరుగుదొడ్ల మురికిగా ఉన్నాయని, కంపుకొడుతున్నాయని ప్రజలు తేల్చి చెప్పారు. కోల్ కతా, డిల్లీ, ముంబాయి, చెన్నై నగరాల్లోని పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా లేవని ప్రజలు అభిప్రాయపడ్డ
న్యూడిల్లీ :భారత్ లోని నాలుగు ప్రధాన నగరాల్లో మరుగుడొడ్లు కంపు కొడతాయని సర్వే తేల్చింది.మరుగుదొడ్ల తో తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నట్టు ప్రజలు చెప్పారు. మరుగుదొడ్ల కారణంగా ప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారంటే ఆశ్చర్యపోతారు.95 శాతం ప్రజలు కొత్త మరుగుదొడ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలోని కోల్ కతా, డిల్లీ, చెన్నై, ముంబాయి నగరాల్లోని పబ్లిక్ టాయిలెట్లు కంపుకొడతాయని తాజా సర్వేలో తేలింది. ఈ మరుగుదొడ్లతో తాము అసంతృప్తికి గురౌతున్నట్టు ప్రజలు చెప్పారు.ఈ టాయిలెట్లు ఏ మాత్రం ప్రజలకు ఆరోగ్యకరం కావని సర్వే తేల్చింది. 95 శాతం కొత్త మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాడ్ చేస్తున్నారు.

తాము వెళ్ళాలనుకొన్న ఊరు వెళ్ళకుండా మానేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి,.మరుగుదొడ్లు సక్రమంగా లేని కారణంగానే 70 శాతం మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారు. వెళ్ళాల్సిన ఊర్లను మార్చుకొంటున్నట్టు సర్వేలో అభిప్రాయపడ్డారు.డిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కతా ,హైద్రాబాద్, పుణె తదితర నగరాల్లోని పది వేల మందిని సర్వే చేసి ఈ నివేదికను తయారు చేశారు.
దేశంలోని కోల్ కతాలో మరుగుదొడ్ల పరిస్థితి అసలు బాగాలేదని ప్రజలు చెప్పారు. ఇక్కడ మరుగుదొడ్లను చూస్తే కంపుకొడతాయని లేని రోగాలు వస్తాయని ఇబ్బందిపడాల్సి వస్తోందని కోల్ కతా వాసులు అభిప్రాయపడ్డారు. 43 శాతం మంది కొల్ కతా మరుగుదొడ్ల పై తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.దేశ రాజధానిలో కూడ పరిస్థితిలో మార్పులేదు. 29 శాతం మంది మరుగుదొడ్ల పరిస్థితిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైద్రాబాద్ లో 20 శాతం మంది మరుగుదొడ్ల నిర్వహణ బాగా
లేదన్నారు. చెన్నై, ముంబాయిలలో 29 శాతం మంది పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయని చెప్పారు.పుణెలో 18శాతం,బెంగుళూరులో 14 శాతం మంది మరుగుదొడ్ల పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఈ సర్వే తెలిపింది. హాలిడే ఐ క్యూ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. పర్యాటక ప్రాంతాల్లో కూడ చాలిననని మరుగుదొడ్లు లేని విషయాన్ని కూడ సర్వే తేటతెల్లం చేసింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications