పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!
ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్సభ ప్యానెల్. గడువు ముగిసినా ఇంకా ఆ బంగ్లాలను పట్టుకుని వేలాడుతున్న సదరు ఎంపీలకు తగిన బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో ఆ ఎంపీల నివాసాలకు వాటర్, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.
గడువు ముగిసినప్పటికీ అధికారిక నివాసాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలకు లోక్సభ ప్యానెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని ల్యూటిన్స్ ప్రాంతంలోని అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయినా కూడా సదరు మాజీలు ఆ బంగ్లాలను వీడటం లేదు. దాంతో వారిని ఎలాగైనా ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ ప్యానెల్ గట్టి నిర్ణయం తీసుకుంది.

అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీల నివాసాలకు నీరు, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ ప్యానెల్ ఆదేశాలు జారీచేసింది. దానికోసం పోలీసుల సహాయం కావాలని కోరింది. ఎంపీలు సాధారణంగా లోక్సభ రద్దయిన తర్వాత నెలలోపు బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది తమ పదవీకాలం ముగిసినా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని పరిస్థితి కనిపిస్తోంది.
16వ లోక్సభ రద్దయిన తర్వాత ల్యూటిన్స్ ఢిల్లీలోని అధికారిక బంగ్లాల్లో 27 మంది మాజీ ఎంపీలు ఇంకా అక్కడే ఉండిపోయారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త ఎంపీలకు కొందరికి ఇంతవరకు బంగ్లాలు కేటాయించలేదు. మాజీ ఎంపీలు ఖాళీ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దాంతో మాజీ ఎంపీలపై చర్యలు తీసుకుని.. వారిని ఖాళీ చేయిస్తే తప్ప కొత్త ఎంపీలకు బంగ్లాలు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే లోక్సభ ప్యానెల్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వారిని ఖాళీ చేయించే పనిలో పడింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications