చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తే తన్ని తరిమేస్తారు జాగ్రత్త: వార్నింగ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీతో సంబంధం లేని టీటీవీ దినకరన్ వర్గంలోకి వెళ్లి తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా బుద్ధిరావాలని అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు వైతిలింగం అన్నారు.

చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావ్: రసవత్తర రాజకీయాలకు ఫుల్ స్టాప్ !చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావ్: రసవత్తర రాజకీయాలకు ఫుల్ స్టాప్ !

బుధవారం ఎంపీ వైతిలింగం మీడియాతో మాట్లాడుతూ 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ చట్టపరంగానే అనర్హత వేటు వేశారని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లింఘించిన వారికి ఇలాగే జరుగుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

Disqualified MLAs can not enter in the assembly MP Vaithilingam

అనర్హతకు గురైన 18 మంది దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అవకాశం లేదని అన్నారు. దౌర్జన్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని మెడపట్టి బయటకు గెంటేస్తారని ఎంపీ వైతిలింగం అన్నారు.

టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యద్దు: తమిళనాడు పోలీసులకు హైకోర్టు, నాన్ బెయిల్ బుల్ కేసుటీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యద్దు: తమిళనాడు పోలీసులకు హైకోర్టు, నాన్ బెయిల్ బుల్ కేసు

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసిన స్పీకర్ ధనపాల్ ను తమిళనాడు మాజీ స్పీకర్ పీహెచ్. పాండియన్ సమర్థించారు. స్పీకర్ ధనపాల్ చట్టపరంగానే 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకున్నారని మాజీ స్పీకర్ పీహెచ్. పాండియన్ చెప్పారు.

English summary
MP Vaithilingam said Disqualified MLAs can not enter in the assembly. If they tried to enter in the assembly the securities will not allow them he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X