నితీష్ కుమార్కు షాక్, చెక్కును తిప్పిపంపిన అమరజవాన్ కుటుంబం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన చెక్కును ఓ అమరజవాన్ కుటుంబం తిరస్కరించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరజవానుకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఉగ్రవాదుల గుళ్లకు బలైన జవానును మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిలా చూస్తారా? చెక్కు మీరే తీసుకోండంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీనగర్లోని కరణ్ నగర్ ఏరియాలో గత సోమవారం ఉగ్రవాదుల తూటాలకు బీహార్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ముజాహిద్ ఖాన్ తీవ్రంగా గాయపడి అదేరోజు సాయంత్రం ఆసుపత్రిలో కన్నుమూశాడు. బుధవారం ఆయన భౌతికకాయం అర్రా జిల్లాలోని పీరో గ్రామానికి చేరుకుంది.

అతని భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నితీష్ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు రాజకీయ పార్టీల నేతలు కానీ, అధికారులు కానీ హాజరు కాలేదు. ఇది స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.
అంత్యక్రియల సమయంలో సబ్ డివిజనల్ స్థాయి అధికారి ఒకరు అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందించేందుకు వచ్చారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని తిప్పి పంపించారు.
అమరజవాను సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, ఆయనకు ఎలాంటి మర్యాద ఇచ్చారో చూడండని, తమ అన్న తాగి చనిపోయాడా, ఈ సొమ్ముతో మేం ఏం చేసుకోవాలని ప్రశ్నించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications