కర్ణాటక ప్రభుత్వంపై 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ హైకమాండ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు రాలేదని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఎంబి. పాటిల్ తదితరులు శనివారం ఢిల్లీ వెలుతున్నారు.
20 మంది కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలను ఒక్కటి చేసిన ఎంబి. పాటిల్ కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి మూడు రోజుల నుంచి సినిమా చూపిస్తున్నారు. మంత్రి పదవులు విషయంలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, సీనియర్ మంత్రలు డీకే. శివకుమార్, ఆర్ వీ. దేశ్ పాండే, కృష్ణభైరే గౌడ, జమీర్ అహమ్మద్, దినేష్ గుండూరావ్ తదితరులు ఎంబి. పాటిల్ ఇంటికి వెళ్లి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.
ఎంత మంది నాయకులు నచ్చచెప్పినా ఎంబి. పాటిల్ మాత్రం ఆయన మనసు మార్చుకోలేదు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎంబి. పాటిల్ తో పాటు అసమ్మతి ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావాలని సూచించింది. శనివారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, గులామ్ నబి ఆజాద్, కేసీ. వేణుగోపాల్ తదితరులతో సమావేశం కానున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications