ఆర్ఆర్ నగర్ మీద కన్ను వేసిన డీకే. మొత్తం బయటకు లాగుతామని ప్రతిపక్షానికి వార్నింగ్ !
బెంగళూరు: బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల సమయంలో వార్తల్లో నిలిచినంతగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజక వర్గం గురించి అంత హాట్ టాపిక్ కాలేదు. ఎన్నికల ప్రచారంతో తెరపైకి వచ్చిన ఇక్కడి బీజేపీ నాయకులు నియోజకవర్గంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవకతవకలన్నింటిపై విచారణ జరుపుతామని కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ తెలిపారు.
మత్తికెరెలోని జేపీ పార్కులో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ మాట్లాడుతూ మల్లత్తహళ్లి చెరువు, హొసకెరె, జేపీ పార్కు అభివృద్ధి పేరుతో కణ్మరె చెరువు పునర్ నిర్మాణం, కొన్ని గార్డెన్ల అభివృద్ధి పేరుతో జరిగినన అవకతవకలపై తగు విచారణ జరిపి ప్రజలకు తెలియజేస్తామని, అందులో ఎలాంటి అవకతవకలు జరగవని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.

బెంగళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం ఆర్ఆర్ నగర్లో అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేలు మునిరత్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచారో అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని,. ఇందుకు సంబంధించి జరిగిన అక్రమాలను బయటపెడుతామని చెప్పారు. బెంగళూరులో త్వరలో బీబీఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయని, అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని డీకే. శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు మీరంతా కృషి చేయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలకు మనవి చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని, దాని ద్వారా బెంగళూరు అభివృద్ధికి మీరు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సులో డీకే శివకుమార్ ఆ పార్టీ కార్యకర్తలకు మనవ చేశారు.

ఇదిలావుండగా, ఆర్ఆర్నగర్ నియోజకవర్గానికి కొంత కళంకం ఉందని, దానిని త్వరలో తెరమరుగు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ అన్నారు. ఇదే సందర్బంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలొ చేశారు. కాంగ్రెస్లో స్థానికులు, వలసలు అనే తేడా లేకుండా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి అందరూ చైతన్యవంతం కావాలని డీకే సురేష్ అన్నారు.
బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన కుసుమా మాట్లాడుతూ తాను ఎవరి మీద పగలు, ప్రతీకారాలు తీర్చకోవాలన అనుకోవడం లేదని అన్నారు. ఈనియోజక వర్గంలో అక అక్రమాలు, మోసాలు చేశారని, వారిని దేవుడు కూడా క్షమించడని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుసుమా అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications