శుభవార్త: లేడీ టెక్కీలకు నైట్ షిఫ్టులు వద్దు, కారణమిదే!
రాత్రివేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ స్పష్టం చేసింది.మహిళల భద్రత రీత్యా ఈ మేరకు ప్రభుత్వ ప్యానెల్ ఐటీ కంపెనీలకు ఆధేశాలు జారీ చేసింది.
బెంగుళూరు: రాత్రివేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ స్పష్టం చేసింది.మహిళల భద్రత రీత్యా ఈ మేరకు ప్రభుత్వ ప్యానెల్ ఐటీ కంపెనీలకు ఆధేశాలు జారీ చేసింది.
ఐటీ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో రాత్రి వేళల్లో మహిళలకు షిఫ్ట్ లు వేయకూడదని సూచించింది. వారి భద్రతకు, వ్యక్తిగత స్వేఛ్చకు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే బెంగుళూరులోని ఏ కంపెనీ కూడ మహిళలకు రాత్రిపూట విధులు అప్పగించరాదని స్పష్టం చేసింది.
మహిళ సంరక్షణ చిన్నారుల సంక్షేమంపై కర్ణాటక ప్రభుత్వం ఓ శాసనసభ కమిటీని వేసింది.దీనికి ఎన్ ఏ హ్యారిస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ చివరకు ఐటీ , బీటీ రంగాల్లో మహిళలకు విధులు రాత్రి వేళల్లో అప్పగించరాదని సూచించింది.
ఆయా కంపెనీలు మహిళలకు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో మాత్రమే పనులను అప్పగించాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 9వ, తేదిన ఈ కమిటీ బెంగుళూరులోని ఇన్పోసిస్ , బైకాన్ వంటి కంపెనీలకు వెళ్ళి అభిప్రాయాలను సేకరించి ఈ ప్రతిపాదనలను చేసింది.