IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్లో స్విగ్గీలో నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు..
ఐపీఎల్ 2023 చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్తో పూర్తి ముగింపుతో ముగిసింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరదలతో పాటు బిర్యానీ ఆర్డర్ల వరద పారింది. ఈ ఐపీఎల్ సీజన్ లో స్విగ్గీకి నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. దాదాపు 3.50 లక్షల ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది.
మే 29న జరిగిన ఐపీఎల్ 2023లో చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ ను ఓడించి, చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కైవసం చేసుకుంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రికార్డు సృష్టించింది. ఈ ఐపీఎల్ సీజన్ లో మొత్తం 12మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని స్విగ్గీ తెలిపింది. అందులో ముఖ్యంగా ఎక్కువ ఆర్డర్స్ వచ్చింది బిర్యానీకేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా 61,000 పిజ్జా ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్ పోల్లో, హైదరాబాదీ నుంచి బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయి. లక్నో నుంచి బిర్యానీ 14.2 శాతం ఆర్డర్లు వచ్చాయి. కోల్కతా నుంచి బిర్యానీ 10.4 నుంచి ఆర్డర్లు వచ్చాయి.

2023 నూతన సంవత్సర వేడుకల నాడు కోసం 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్ వచ్చాయి. అయితే వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానా? అనే విషయంపై స్విగ్గీ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు స్విగ్గీ, జొమాటోకు పోటిగా ఓఎన్డీసీ వచ్చిన సంగతి తెలిసిందే. అరిటిక్ వ్యవస్థాపకుడు అంకిత్ ప్రకాష్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)లో విక్రయదారు యాప్ అయిన Paytmలో ఇండియానా బర్గర్స్ నుంచి పనీర్ బర్గర్, పెప్సీ కాంబోను ఆర్డర్ చేశాడు. వీటి ధర స్విగ్గీ వసూలు చేస్తున్నదానికంటే 45 తక్కువ ఉందన్నారు. దీంతో ONDC రోజువారీ ఆర్డర్ వాల్యూమ్లను 2.5X పెగింది. ఆర్డర్లు 10,000 నుంచి 25,000 ఆర్డర్లకు పెరిగాయి.












Click it and Unblock the Notifications