బిజెపి ముఖ్యమంత్రులకు లేఖ, ముందస్తు ఎన్నికలకు మోడీ మొగ్గు
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరిగితే అభివృద్దికి విఘాతం కలగకుంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఈ విషయాన్ని మోడీ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రకటించారు. మెజారిటీ ముఖ్యమంత్రులు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు.
రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలతో పాటు పార్లమెంట్ స్థానాలకు కూడ ఎన్నికలను జరపాలనే అభిప్రాయంతో బిజెపి ఉందనే ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ కూడ ముందస్తు ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించింది.ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ యంత్రాంగానికి ఆదేశించారు.
బిజెపికి చెందిన పది మంది రాజ్యసభ సభ్యులతో కూడిన కమిటీ సమావేశం తర్వాత బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అయితే ముందస్తు ఎన్నికలకు తాము కూడ సిద్దంగానే ఉన్నామని ఎన్నికల సంఘం కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications