ఇది కుట్ర: ఆర్ కే నగర్ లో విజయం నాదే: ఎప్పటికైనా నేనే హీరో: దినకరన్
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ నేనే విజయం సాధిస్తానని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదట ఓటుకు నోటు కేసు నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయం ఆలోచించాలని పన్నీర్ సెల్వం వర్గం శశ
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం నాదే అంటూ ఆ నియోజక వర్గంలో పోటీకి దిగిన శశికళ వర్గంలోని అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్ కే నగర్ ప్రజలు అందరూ తనవైపే ఉన్నారని దినకరన్ చెప్పారు.
సోమవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా పడటంపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తననే వరిస్తుందని జోస్యం చెప్పారు.
ఈసీ చాల పెద్ద తప్పు చేసింది
ఆర్ కే నగర్ ఉప ఎన్నిక రద్దు చెయ్యడం ద్వారా ఈసీ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని టీటీవీ దినకరన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం కావాలనే మా మీద దుష్ర్పచారం చేస్తున్నారని, తాము స్థానిక ఓటర్లకు డబ్బులు పంచలేదని దినకరన్ స్ఫష్టం చేశారు.
సీబీఐతో విచారణ చేయించాలి
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా డబ్బుల పంపిణిపై సీబీఐతో విచారణ చేయించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఆయన మంత్రి వర్గంపై కూడా దర్యాప్తు చేయించాలని ఎన్నికల అధికారులను కోరారు.
ఆదివారం రాత్రి వరకు హోరా హోరీ
జయలలిత మరణంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని శశికళ వర్గం శ్రమించింది. ఆదివారం రాత్రి కూడా అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు హోరాహోరీగా ఆర్ కే నగర్ లో ప్రచారం చేశాయి.
ఇరకాటంలో శశికళ వర్గం
ఎన్నికల కమిషన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నిక రద్దు చెయ్యడంతో శశికళ వర్గీయులు ఇరకాటంలో పడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారని తెలుసుకున్న ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడంతో ఈ నగదు పంపకాల వ్యవహారం గుట్టురట్టుకావడంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది.
పన్నీర్ సెల్వం వర్గం కేక
ఆర్ కే నగర్ ఉ ఎన్నికల రద్దుపై అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఎప్పటికైనా నేనే గెలుస్తా అంటూ దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ కేసు నుంచి బయటపడే మార్గం చూసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు శశికళ వర్గానికి సూచిస్తున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని పన్నీర్ సెల్వం వర్గం, బీజేపీ స్వాగతించింది.