Bihar Polls: డిప్యూటీ సీఎంపై దాడి-కఠిన చర్యలకు ఈసీ ఆదేశాలు..!
బీహార్ లో ఇవాళ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో లఖీసరాయ్ జిల్లాలో జరిగిన డిప్యూటీ సీఎం విజయ్ సిన్వా కాన్వాయ్ పై దాడి తీవ్ర కలకలం రేపింది. చెప్పులు, రాళ్లు, పేడతో ఆయన కాన్వాయ్ పై ఆర్జేడీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వారు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తీవ్రంగా స్పందించారు. అనంతరం ఈసీ కూడా సీరియస్ అయింది.
లఖీసరాయ్ జిల్లాలో డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్ధి కూడా అయిన విజయ్ సిన్హా కాన్వాయ్ పై జరిగిన దాడిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనపై స్పందించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. శాంతిభద్రతలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించబోమని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత డీఐజీ రాకేష్ కుమార్ ఖురియారి గ్రామాన్ని సందర్శించి ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఈ సంఘటన గురించి అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించినప్పుడు కొంతమంది స్థానికులు నిరసన తెలిపారని, ఆయన వాహనంపై బురద, ఆవు పేడ ఉన్నట్లు గమనించానని తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తారన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.

ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతూ.. ముంగేర్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని డీఐజీ తెలిపారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఏ బూత్ నుండి ఎటువంటి అవాంతరాలు సంభవించలేదని వెల్లడించారు. ఎక్కడా ఓటింగ్ ప్రభావితం కాలేదన్నారు. ముంగేర్ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. బీహార్ ఎన్నికల మొదటి దశలో ఓటు వేయడానికి ముందు విజయ్ సిన్హా జగదాంబ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications