సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.
మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆమే వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా, అవి ఇప్పుడు ఈసి పరిధిలోకి వెళ్లాయి .దీంతో ఆమే నోటీసులు అందుకోనున్నారు.

సాద్వి టంగ్ పవర్ , ఈసి నోటీసులు
బోపాల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, మాలేగావ్ పేలుళ్ల కేసును విచారించిన ఐపిఎస్ అధికారి హెమంత్ కర్కరే పై చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఆ వ్యాఖ్యలపై 24 గంటల లోగా సమాధానం చెప్పాలని ఆమేకు నోటీసులు జారి చేయనున్నారు. కాగా సాద్వీ హెమంత్ కర్కరే పై చేసిన వ్యాఖ్యలను ఈసీ సుమోటాగా తీసుకుని ఈమేకు నోటీసులు జారి చేయనున్నారు.

సాధ్వి వ్యాఖ్యలను సుమోటాగా స్వకరించిన ఈసీ,
సాధ్వీ ప్రగ్యా వ్యాఖ్యలను సుమోటగా స్వికరించాం. దీనిపై అస్టిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నుండి నివేదిక కూడ కోరామని , ఈ ఉదయమే నివేదిక వచ్చిందని త్వరలోనే ఆమేకు నోటీసులు జారి చేస్తమని ఎన్నికల అధికారులు తెలిపారు.కాగా నోటిసులు అందిన 24 గంటలలోగా ఆమే సమాధానం చెప్పాలని అన్నారు. కాగా అక్కడి నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ పంపిస్తున్నట్టుు బోపాల్ జిల్లా ఎన్నికల అధికారి సుదమ్ ఖడే తెలిపారు.

మాలేగావ్ పేలుళ్ల కేసును విచారించిన కర్కరే సర్వనాశనం అవుతారు
కాగా మాలేగావ్ పేలుళ్లలో అరెస్ట్ అయిన సాధ్వి ప్రగ్యాను కర్కరే చిత్రహింసలకు గురిచేశారని అందుకే ఆయన సర్వనాశనమై పోతావని శపించానని అనంతరమే ఆయన మృత్యువాత పడ్డారని రెండు రోజుల క్రితం బోపాల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో సాధ్వీ అన్నారు. దీంతో ఆమే మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి, దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. కాగా ఈమే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోది సైతం క్షమాపణలు చెప్పడంతో ఆమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా సాధ్వి వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఆమే క్షమాపణలు కూడ చెప్పారు.












Click it and Unblock the Notifications