గుజరాత్ ఎన్నికలు: రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకున్న ఈసీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి ఇచ్చిన నోటీసులను ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం రాత్రి ఉపసంహరించుకుంది. గుజరాత్లో ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఆయన టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
దీంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపించింది. డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 126 పైన సమీక్షించాల్సి ఉన్నందున నోటీసును వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం మీడియా వివిధ రూపాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు ప్రచారాన్ని నిలిపివేయాలన్న నిబంధనపై సమీక్షించేందుకు, సవరణలు సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో ఎన్నికల సంఘం, సమాచార, ప్రసార, న్యాయ, ఐటీ శాఖలు, నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులు ఉంటారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటం, వివిధ దశలలో పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా దీనిని సమీక్షించాల్సి ఉందని ఈసీ పేర్కొంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications