Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Economic survey 2022-23:ఈ ఆర్థిక సంవత్సరంకు వృద్ధి రేటు అంచనా ఎంత..?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో 2021-22కి సంబంధించిన ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను లోక్‌సభలో ప్రవేశపెడతారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి 9శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఎకనామిక్ సర్వేను సిద్ధం చేసినట్లు సమాచారం. గతేడాది కోవిడ్-19 సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11శాతంగా వృద్ధి రేటును నిర్ధేశిస్తూ నిర్మలాసీతారామన్ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టారు. అది ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తుంది.

గతేడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పలు కీలక అంశాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సప్లయ్‌తో పాటు సంస్కరణలు, నిబంధనలను సరళతరం చేయడం, మౌలికరంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం, ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడం, తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ ఏడాది ఆర్థిక సర్వే ఎలా ఉంటుందా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎకనమిక్ సర్వేకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం:

Economic survey 2022-23 live updates in Telugu:Know the projected growth for this fiscal year

Jan 31, 2022, 1:38 pm IST

ముగిసిన ఆర్థిక సర్వే... రేపటికి వాయిదా పడ్డ లోక్‌సభ
Jan 31, 2022, 1:30 pm IST

ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్‌బ్యాంకులు కలిసి పలు చర్యలు తీసుకున్నాయి
Jan 31, 2022, 1:26 pm IST

భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచేందుకు సప్లయ్ అంశం కీలకం. ఈ అంశంపైనే దృష్టి సారించడం జరిగింది
Jan 31, 2022, 1:25 pm IST

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న వృద్ధి, సంస్కరణలను వివరించిన ఎకనామిక్ సర్వే
Jan 31, 2022, 1:23 pm IST

నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 8శాతం నుంచి 8.5శాతంగా అంచనా
Jan 31, 2022, 12:50 pm IST

రాష్ట్రపతి ప్రసంగంలో చైనా, పాకిస్తాన్ ప్రస్తావన లేదన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ
Jan 31, 2022, 12:12 pm IST

రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అభ్యంతరం
Jan 31, 2022, 12:11 pm IST

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 12:07 pm IST

ముగిసిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రసంగం.మరికాసేపట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
Jan 31, 2022, 12:00 pm IST

లాక్‌డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Jan 31, 2022, 11:57 am IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Jan 31, 2022, 11:56 am IST

పార్లమెంటులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగం
Jan 31, 2022, 11:41 am IST

భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముకలాంటిది
Jan 31, 2022, 11:37 am IST

ఎంఎస్ఎంఈలు భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:36 am IST

స్మార్ట్‌ఫోన్ తయారీలో భారత్ అగ్రదేశాల సరసన నిలుస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:35 am IST

టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో త్వరలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:30 am IST

5జీ టెక్నాలజీపై భారత్ దృష్టి సారిస్తోంది:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:27 am IST

పర్యావరణంకు సంబంధించిన స్టార్టప్‌లు వేగం పుంజుకున్నాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:27 am IST

ప్రభుత్వ పథకాలతో ముస్లిం మహిళలు లబ్ధి పొందుతున్నారు:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:26 am IST

త్రిపుల్ తలాక్ అనే సామాజిక రుగ్మతలకు ప్రభుత్వం చెక్ పెట్టింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:24 am IST

మహిళాసాధికారితకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:21 am IST

ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:15 am IST

అతిపెద్ద ఆహార పంపిణీ వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:14 am IST

డిజిటల్ పథకాల ద్వారా రోడ్డుపక్కన చిరువ్యాపారాలు చేసేవారు లబ్ధి పొందుతున్నారు:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:13 am IST

దేశం డిజిటల్ దిశగా పయనిస్తోంది. డిసెంబర్ 2021 నాటికి డిజిటల్ ద్వారా దాదాపు 8 లక్షల కోట్లు చెల్లింపులు జరిగాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:12 am IST

కరోనా సమయంలో భారత్ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌లను పౌరులకు ఇచ్చింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:11 am IST

ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:09 am IST

భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌లు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నాం: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:05 am IST

థర్డ్ వేవ్‌ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 10:42 am IST

మరికాసేపట్లో పార్లమెంటు భవనానికి చేరుకోనున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+