కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటులో 2021-22కి సంబంధించిన ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. ముందుగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను లోక్సభలో ప్రవేశపెడతారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి 9శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఎకనామిక్ సర్వేను సిద్ధం చేసినట్లు సమాచారం. గతేడాది కోవిడ్-19 సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11శాతంగా వృద్ధి రేటును నిర్ధేశిస్తూ నిర్మలాసీతారామన్ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టారు. అది ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తుంది.
గతేడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పలు కీలక అంశాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సప్లయ్తో పాటు సంస్కరణలు, నిబంధనలను సరళతరం చేయడం, మౌలికరంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం, ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడం, తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక ఈ ఏడాది ఆర్థిక సర్వే ఎలా ఉంటుందా అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎకనమిక్ సర్వేకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం:
Jan 31, 2022, 1:38 pm IST
ముగిసిన ఆర్థిక సర్వే... రేపటికి వాయిదా పడ్డ లోక్సభ
Jan 31, 2022, 1:30 pm IST
ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్బ్యాంకులు కలిసి పలు చర్యలు తీసుకున్నాయి
Jan 31, 2022, 1:26 pm IST
భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరచేందుకు సప్లయ్ అంశం కీలకం. ఈ అంశంపైనే దృష్టి సారించడం జరిగింది
Jan 31, 2022, 1:25 pm IST
ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న వృద్ధి, సంస్కరణలను వివరించిన ఎకనామిక్ సర్వే
Jan 31, 2022, 1:23 pm IST
నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే
2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 8శాతం నుంచి 8.5శాతంగా అంచనా
Jan 31, 2022, 12:50 pm IST
రాష్ట్రపతి ప్రసంగంలో చైనా, పాకిస్తాన్ ప్రస్తావన లేదన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ
Jan 31, 2022, 12:12 pm IST
రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అభ్యంతరం
Jan 31, 2022, 12:11 pm IST
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 12:07 pm IST
ముగిసిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రసంగం.మరికాసేపట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
Jan 31, 2022, 12:00 pm IST
లాక్డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎంఎస్ఎంఈలు భారత్ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:36 am IST
స్మార్ట్ఫోన్ తయారీలో భారత్ అగ్రదేశాల సరసన నిలుస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:35 am IST
టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో త్వరలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:30 am IST
5జీ టెక్నాలజీపై భారత్ దృష్టి సారిస్తోంది:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:27 am IST
పర్యావరణంకు సంబంధించిన స్టార్టప్లు వేగం పుంజుకున్నాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:27 am IST
ప్రభుత్వ పథకాలతో ముస్లిం మహిళలు లబ్ధి పొందుతున్నారు:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:26 am IST
త్రిపుల్ తలాక్ అనే సామాజిక రుగ్మతలకు ప్రభుత్వం చెక్ పెట్టింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:24 am IST
మహిళాసాధికారితకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:21 am IST
ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:15 am IST
అతిపెద్ద ఆహార పంపిణీ వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:14 am IST
డిజిటల్ పథకాల ద్వారా రోడ్డుపక్కన చిరువ్యాపారాలు చేసేవారు లబ్ధి పొందుతున్నారు:రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:13 am IST
దేశం డిజిటల్ దిశగా పయనిస్తోంది. డిసెంబర్ 2021 నాటికి డిజిటల్ ద్వారా దాదాపు 8 లక్షల కోట్లు చెల్లింపులు జరిగాయి: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:12 am IST
కరోనా సమయంలో భారత్ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లను పౌరులకు ఇచ్చింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:11 am IST
ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:09 am IST
భారత్లో తయారైన వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నాం: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 11:05 am IST
థర్డ్ వేవ్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
Jan 31, 2022, 10:42 am IST
మరికాసేపట్లో పార్లమెంటు భవనానికి చేరుకోనున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
READ MORE
8:38 AM, 31 Jan
ఢిల్లీ
ఇవ్వాళ వెలువడనున్న ఎకనమిక్ సర్వే నివేదిక.
8:39 AM, 31 Jan
ఢిల్లీ
పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసిన అరగంట తరువాత ఆర్థిక సర్వేను టేబుల్ చేయనున్న కేంద్ర ప్రభుత్వం
8:58 AM, 31 Jan
ఢిల్లీ
2022-23 ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకుని ఎకనామిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా వృద్ధిరేటును లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీన్ని తొమ్మిదికి కుదించడం చర్చనీయాంశమైంది.
9:46 AM, 31 Jan
కేంద్ర ఐటీ శాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసిన కాంగ్రెస్ లోక్సభా పక్ష నాయకుడు అధిర్ రంజన్
9:54 AM, 31 Jan
బడ్జెట్ సమావేశాలకు ముందు భేటీ అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా
The Vice President and Chairman of Rajya Sabha, Shri M. Venkaiah Naidu and the Speaker of Lok Sabha, Shri Om Birla held a meeting at Upa-Rashtrapati Nivas today. @ombirlakotapic.twitter.com/LkFUwBRwZ6