ఆర్దికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత - దేశ ఆర్దిక వ్యవహారాల్లో కీలకంగా..!!
ప్రముఖ ఆర్దికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూసారు. ఆయన వయసు 72. గుండెపోటుతో అభిజిత్ సేన్ మరణించినట్లు ఆయన సోదరుడు ప్రణబ్ సేన్ వెల్లడించారు. సోమవారం రాత్రి 11 గంటలు దాటిని తరువాత అభిజిత్ కు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకొనేలోగానే అభిజిత్ ప్రాణాలు కోల్పోయారు.
ఆర్దిక వేత్తగా..ప్రణాళికా సంఘం సభ్యుడుగా అభిజిత్ సేన్ వ్యవహరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అభిజిత్ కు మంచి పట్టు ఉంది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్గా పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 2004-2014 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారు. వ్యవసాయ ధరల కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధానంగా వ్యవసాయ రంగం పైన పెట్టుబడులు..సంస్కరణల దిశగా అనేక సూచనలు చేసారు.

ధరల స్థిరీకరణ పైన ప్రభుత్వ నిర్ణయంలో కీలకంగా పని చేసారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో అభిజిత్ సేన్ దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రాన్ని బోధించారు. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ చైర్మన్తో పాటు పలు పదవుల్లోనూ పని చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications