మమత మా డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు..! సుప్రీంకోర్టులో ఈడీ షాకింగ్..!
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఏడాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న కన్సల్టెన్సీ ఐప్యాక్ ఆఫీసులో తాజాగా ఈడీ దాడులు నిర్వహించడం, వాటిని నిరసిస్తూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి అడ్డుకోవడం జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో ఇరువర్గాలూ పిటిషన్లు దాఖలు చేసినా విచారణ మాత్రం జరగలేదు. దీంతో ఇప్పుడు వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కోల్ కతాలోని ఐ ప్యాక్ ఆఫీసులో తమ తనిఖీల్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అధికార యంత్రాంగం సాయంతో స్వయంగా అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇది తమ విధుల్ని అడ్డుకోవడమేనని, ఆర్టికల్ 32 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా కోరింది. దీనిపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంలో తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులోనూ దాదాపు ఇలాంటి విజ్ఞప్తులే చేసినా విచారణ జరిగి తీర్పు రాకపోవడంతో ఈడీ ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణ మధ్యలో ఉండగానే కోర్టు హాల్లోకి భారీ ఎత్తున లాయర్లు, తృణమూల్ నేతలు చొచ్చుకొచ్చారు. కేసుకు సంబంధం లేని వాళ్లను బయటికి పంపాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చినా వారు మాత్రం బయటికి వెళ్లలేదు. దీంతో విచారణ వాయిదా వేసి జడ్జి వెళ్లిపోయారు.

తృణమూల్ నేత జైన్ ఇంట్లో జరిగిన దాడిలో ముఖ్యమంత్రి మమత తమ కస్టడీ నుండి నేరారోపణ పత్రాలను తీసుకెళ్లారని ఈడీ సుప్రీంకోర్టులో ఆరోపించింది. దీనిపై స్పందిస్తూ మమత.. ఈడీ తనను, తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశాలు ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామాలు-ఈడీ తాజా షాక్..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications