మమత మా డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు..! సుప్రీంకోర్టులో ఈడీ షాకింగ్..!
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఏడాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న కన్సల్టెన్సీ ఐప్యాక్ ఆఫీసులో తాజాగా ఈడీ దాడులు నిర్వహించడం, వాటిని నిరసిస్తూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి అడ్డుకోవడం జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై హైకోర్టులో ఇరువర్గాలూ పిటిషన్లు దాఖలు చేసినా విచారణ మాత్రం జరగలేదు. దీంతో ఇప్పుడు వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కోల్ కతాలోని ఐ ప్యాక్ ఆఫీసులో తమ తనిఖీల్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన అధికార యంత్రాంగం సాయంతో స్వయంగా అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇది తమ విధుల్ని అడ్డుకోవడమేనని, ఆర్టికల్ 32 కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కూడా కోరింది. దీనిపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంలో తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులోనూ దాదాపు ఇలాంటి విజ్ఞప్తులే చేసినా విచారణ జరిగి తీర్పు రాకపోవడంతో ఈడీ ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణ మధ్యలో ఉండగానే కోర్టు హాల్లోకి భారీ ఎత్తున లాయర్లు, తృణమూల్ నేతలు చొచ్చుకొచ్చారు. కేసుకు సంబంధం లేని వాళ్లను బయటికి పంపాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు ఇచ్చినా వారు మాత్రం బయటికి వెళ్లలేదు. దీంతో విచారణ వాయిదా వేసి జడ్జి వెళ్లిపోయారు.

తృణమూల్ నేత జైన్ ఇంట్లో జరిగిన దాడిలో ముఖ్యమంత్రి మమత తమ కస్టడీ నుండి నేరారోపణ పత్రాలను తీసుకెళ్లారని ఈడీ సుప్రీంకోర్టులో ఆరోపించింది. దీనిపై స్పందిస్తూ మమత.. ఈడీ తనను, తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశాలు ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు












Click it and Unblock the Notifications