వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామి విసిగిపోయారు: సొంతఊరు వెళ్లిపోయారు: ఎందుకంటే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి రోజురోజుకూ జరుగుతున్న రాజకీయాలు తట్టుకోలేక విసిగిపోయారో ? ఏమో ? సొంత ఊరికి బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లో పూజలు, హోమాలు, యాగం చెయ్యడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.

<strong>రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి!</strong>రహస్యంగా చెన్నై స్టార్ హోటల్ లో భేటీ: సంతకాలు సేకరించిన సీఎం పళనిసామి!

సేలం జిల్లాలోని ఎడప్పాడి పళనిసామి సొంత ఊరు. ఎడప్పాడి నియోజక వర్గం నుంచి పళనిసామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రోజు రోజుకూ రాజకీయ ఒత్తిడి ఎక్కువ కావడంతో పళనిసామి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇన్ని రోజులు పన్నీర్ సెల్వం వర్గం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకున్నారు.

 Edappadi Palanisamy arranged poojas and yagam in his home town

అయితే గురువారం ఒక్క సారిగా సొంత గూటిలోని 28 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టడానికి సిద్దం కావడంతో సీఎం ఎడప్పాడి పళనిసామి మరింత ఒత్తిడికి గురైనారు. గత శనివారం ఎడప్పాడిలో సీఎం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

<strong>28 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: అన్నాడీఎంకేలో మూడో గ్రూప్, తలపట్టుకున్న సీఎం!</strong>28 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: అన్నాడీఎంకేలో మూడో గ్రూప్, తలపట్టుకున్న సీఎం!

ఆ సందర్బంలో ఢిల్లీ బయలుదేరడానికి సిద్దం అయిన పళనిసామి సొంత ఊరిలో జరుగుతున్న పూజలకు హాజరుకాలేకపోయారు. ఇప్పుడు తనకు ఎలాంటి సమస్యలు ఎదురూకాకుండా నా పదవి ఎలాగైనా కాపాడు దేవుడా అంటూ ప్రత్యేక పూజలు చెయ్యడానికి సొంత ఊరికి బయలుదేరారు.

English summary
Edappadi palanisamy arranged poojas and yagam in his home town to continue as a Chief Minister of TamilNadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X