పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏ
శ్రీనగర్ : పుల్వామా ఉగ్ర దాడి విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ను ఢీ కొని ఆదిల్ అహ్మద్ మృతిచెందగా .. దాడి చేసింది మేమే నని జైషే మహ్మద్ సంస్థ ప్రకటించింది. తర్వాత సూత్రధారి కమ్రాన్ అలియాస్ ఘజి రషీద్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ ఇప్పటికే కీలక వివరాలను రాబట్టింది.
ఎలక్ట్రీషియన్ ది కీ రోల్
ఉగ్ర దాడి విచారణ ప్రక్రియను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. దాడిలో ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మొహమ్మద్ భాయ్ ఒకడని అధికారులు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ అయిన అహ్మద్ ఖాన్ .. సీఆర్పీఎఫ్ దాడి చేసేందుకు ఉపయోగించిన వాహనాన్ని ... పేలుడు పదార్థాలను సమకూర్చాడని వెల్లడించింది. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించినట్టు పేర్కొన్నారు. గతనెలలో ఉగ్ర దాడి జరిగిన రోజు బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.

డిగ్రీ .. ఆ తర్వాత ఐటీఐ
పుల్వామా త్రాల్లోని మీర్ మొహల్లాలో అహ్మద్ కాన్ నివాసంలో ఎన్ ఐ ఏ తనిఖీలు చేపట్టింది. రోజువారీ కూలీ చేసుకునే కుటుంబంలో జన్మించాడని గుర్తించారు. డిగ్రీ పూర్తయ్యక .. ఐటీఐలో ఏడాది ఎలక్ట్రీషియన్ కోర్సు చేశాడని తెలిపారు. 2017లో జైషే మహమ్మద్ సంస్థ క్షేత్రస్థాయి కార్యకర్తగా చేరాడని పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో సుంజువాన్ లోని ఆర్మీ క్యాంప్ పై జరిగిన ఉగ్ర దాడిలో అతని పాత్ర ఉన్నట్టు గుర్తించారు.












Click it and Unblock the Notifications