గుండె నొప్పి: దుబాయి విమానం దించెయ్యండి
చెన్నై: ప్రయాణికుడు అనారోగ్యానికి గురి కావడంతో కౌలాలంపూర్ వెలుతున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో ఆ వృద్దుడి ప్రాణాలు నిలబడ్డాయని అధికారులు చెప్పారు.
శనివారం దుబాయి నుంచి కౌలాలంపూర్ కు ఎమిరేట్స్ ఈకే- 346 విమానం బయలుదేరింది. అందులో దుబాయికి చెందిన 61 సంవత్సరాల వృద్దుడు ప్రయాణిస్తున్నారు. మార్గం మద్యలో ఆయనకు గుండె నొప్పి వచ్చింది.
విషయం తెలుసుకున్న పైలెట్లు వెంటనే ఎమిరేట్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే విమానాన్నిచెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ చెయ్యాలని అధికారులు పైలెట్లకు సూచించారు.
చెన్నై విమానాశ్రయం అధికారుల అనుమతితో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వృద్దుడికి ప్రథమ చికిత్స అందించి తరువాత చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించామని, విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.