ఎన్కౌంటర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ అధికారి మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి వీర మరణం పొందగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమరవీరుడిని సెకండ్ పారా(స్పెషల్ ఫోరెన్స్) రెజిమెంట్ కు చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్గా గుర్తించారు.
ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డు(వీడీజీ)లను చంపిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కేశ్వాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీకి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఇద్దరు వీడీజీల మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి.

ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకోగానే భద్రతా దళాలు భార్త్ రిడ్జ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్లో వెల్లడంచింది. ఇదే ఉగ్రవాదుల గ్రూప్ ఇటీవల ఇద్దరు గ్రామస్థుల(వీడీజీ) అపహరించి చంపేసిందని పేర్కొంది.
GOC White Knight Corps and all ranks salute the supreme sacrifice of Nb Sub Rakesh Kumar of 2 Para (SF). Sub Rakesh was part of a joint CT operation launched in the general area of Bhart Ridge, Kishtwar on 09 November: White Knight Corps pic.twitter.com/fFva2h46q8
— ANI (@ANI) November 10, 2024
కాల్పులు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ సహా మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారని వారిని వెంటనే ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది. అనంతరం అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారిందని తెలిపింది. వారిలో రాకేశ్ కుమార్ పరిస్థితి మిషమించి ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
'వైట్ నైట్ కార్ప్స్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్- జీఓసీ సహా అన్ని ర్యాంకుల అధికారులు సెకండ్ పారా(స్పెషల్ ఫోర్సెస్) నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నారు. కిష్ట్వార్లోని భార్త్ రిడ్జ్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ నాయిబ్ సుబేదార్ భాగం. ఈ బాధాకరమైన సమయంలో అమరవీరుడి కుటుంబంతో మేము ఉన్నాం." అని ఆర్మీ ఎక్స్ వేదికగా పేర్కొంది. కాగా, జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉగ్రవాదులు వరుసగా కాల్పుల ఘటనలకు పాల్పడుతున్నారు. స్థానికేతరులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications