Evidence: హిందూ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ ఎంట్రీ, సాక్షాలు, సుమోటో కేసుతో !
బెంగళూరు/శివమొగ్గ: రోడ్డు మీద మొబైల్ లో మాట్లాడుకుంటూ వెలుతున్న హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసులో ఎన్ఐఏ అధికారులు సాక్షాలు సేకరిస్తున్నారు. సుమారు 14 మంది అధికారులు కర్ణాటకలోని శివమొగ్గ చేరుకుని హర్షా హత్యకు సంబంధించిన సాక్షాలు సేకరించడంలో నిమగ్నం అయ్యారు.ఇదే సమయంలో నలుగురి మీద పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.
ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన రాత్రి శివమొగ్గలో మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెలుతున్న హర్షాను కొందరు వెంబడించి దాడి చేశారు. ప్రాణాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన హర్షాను నడిరోడ్డులో వెంటాడి వెంటాడి నరికి చంపేశారు. హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్యకు గురికావడంతో శివమొగ్గతో పాటు కర్ణాటకలో కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా హిందూ కార్యకర్త హర్షా హత్య కేసు దూమరం రేపింది. ఇప్పటికే హర్షా హత్య కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం హర్షా హత్య కేసులో అరెస్టు అయిన 12 మంది వ్యక్తుల ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు పలువురిని విచారణ చేసి పూర్తి వివరాలు, సమాచారం సేకరించారని తెలిసింది.
Wife: రాత్రి అదే గొడవ, పుట్టింటికి బయలుదేరిన భార్య, భార్యను నరికి చంపేసిన భర్త, కూతురు ఎస్కేప్ !
ఎన్ఐఏ బెంగళూరు కార్యాలయం ఎస్పీ విక్రమన్ తో పాటు మరో 14 మంది అధికారులు శివమొగ్గలో పలు ప్రాంతాల్లో సంచరించి హిందూ సంఘ, సంస్థ కార్యకర్త హర్షా హత్య కేసుకు సంబంధించి సాక్షాలు సేకరించారు. ఇదే సమయంలో హర్షా హత్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని నలుగురి మీద శివమొగ్గ గ్రామీణ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. హర్షా హత్య కేసుకు సంబంధించి వివరాలు వెళ్లడించడానికి ఎన్ఐఏ అధికారులు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది.