బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

EX CM: ప్రధాని మోదీపై ఫైర్, జాతీయ జెండాకు అవమానం అని మాజీ సీఎం మీద కేసు పెట్టిన బీజేపీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కమగళూరు: జాతీయ జెండాను అవమానించారని మాజీ ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ నాయకులు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్బంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సందర్బంలో జాతీయ జెండాను, జాతీయ జెండా రంగులను అవమానించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే అని, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏమీ చెయ్యలేదని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

Illegal affair: ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య, ఎస్ఐ ఆడియో లీక్, వైరల్ !Illegal affair: ఎస్ఐతో భార్య అక్రమ సంబంధం, భర్త ఆత్మహత్య, ఎస్ఐ ఆడియో లీక్, వైరల్ !

 ప్రధాని మోదీ నాటకాలు ఆడుతున్నారు

ప్రధాని మోదీ నాటకాలు ఆడుతున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నాటకాలు ఆడుతున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య ఇటీవల ఆరోపించారు. గతంలో జాతీయగీతం, జాతీయ జెండాను అవమానించిన బీజేపీ నాయకులు ఇప్పుడు హర్ గర్ తిరంగా పేరుతో పెద్ద నాటకానికి తెర తీశారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

 స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ మాత్రమే

స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ మాత్రమే

భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బ్రిటీష్ వాళ్లతో పోరాటం చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. స్వాతంత్రం రావడానికి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీ నాయకులు చేసింది ఏమీ లేదని, వాళ్లు గతంలో జాతీయ జెండాను అవమానించారని, ఇప్పుడు మోదీ నాటకాలు ఆడుతున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు.

 కాషాయాన్ని నలుపు రంగుతో పోల్చిన మాజీ సీఎం ?

కాషాయాన్ని నలుపు రంగుతో పోల్చిన మాజీ సీఎం ?


జాతీయ జెండాలోని కాషాయ రంగును నలుపు రంగుతో అభివర్ణించిన మాజీ సీఎం సిద్దరామయ్య జాతీయ జెండాను అవమానించారని కర్ణాటకలోని చిక్కమగళూరులో బీజేపీ నాయకులు మంపడిపడుతున్నారు. జాతీయ జెండాను, జాతీయ జెండా రంగులను అవమానించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు చిక్కమగళూరులో పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

Recommended Video

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia
సీటీ రవి సొంత ఊరిలో కేసు

సీటీ రవి సొంత ఊరిలో కేసు

బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సిటీ రవి స్వగ్రామం అయిన ఆలూరు పోలీస్ స్టేషన్ లో మాజీ సీఎం సిద్దరామయ్య మీద చిక్కమగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు గిరీష్, భజరంగ్ దళ్ నాయకుడు శివకుమార్ కేసు పెట్టారు. అయితే ఈ విషయాన్ని మాజీ సీఎ: సిద్దరామయ్య చాలా లైట్ గా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

English summary
EX CM: BJP youths police complaint against Karnataka former CM Siddaramaiah in Chikkamagaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X