వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కులు: మాజీ ఎంపి బంధువైన యువతి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

 Ex Dewas MP's relative kills self in Indore
ఇండోర్: తనకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. ఆమె దేవాస్ కాంగ్రెస్ మాజీ ఎంపి కుటుంబసభ్యులకు చెందిన ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. దేవాస్ మాజీ ఎంపి సజ్జన్ సింగ్ వర్మ బంధువైన గీతాంజలి అనే యువతి బి.కాం చదువుతోంది. ఆమె శనివారం విషం తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది.

జుని ఇండోర్ పోలీసుల కథనం ప్రకారం.. గీతాంజలి ఇటీవల జరిగిన బి.కాం పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి, అసంతృప్తికి లోనై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత ఇతర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

English summary
A 21-year-old girl Geetanjali, who was a close relative of an ex-Congress MP from Dewas — Sajjan Singh Verma — allegedly committed suicide by consuming poison at the Verma family's house in Palsikar Colony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X