మార్కులు: మాజీ ఎంపి బంధువైన యువతి ఆత్మహత్య

 Ex Dewas MP's relative kills self in Indore
ఇండోర్: తనకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. ఆమె దేవాస్ కాంగ్రెస్ మాజీ ఎంపి కుటుంబసభ్యులకు చెందిన ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. దేవాస్ మాజీ ఎంపి సజ్జన్ సింగ్ వర్మ బంధువైన గీతాంజలి అనే యువతి బి.కాం చదువుతోంది. ఆమె శనివారం విషం తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది.

జుని ఇండోర్ పోలీసుల కథనం ప్రకారం.. గీతాంజలి ఇటీవల జరిగిన బి.కాం పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి, అసంతృప్తికి లోనై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత ఇతర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+