చాలా మంచిది: మోడీ కరెన్సీ బ్యాన్పై దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ (ఆర్బీఐ) దువ్వూరి సుబ్బారావు స్పందించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం పైన ఆయన ప్రశంసలు కురిపించారు. ఇది పెట్టుబడులకు సానుకూలం అవుతుందన్నారు. అలాగే ద్రవ్యోల్భణం తగ్గుతుందన్నారు.
తన అభిప్రాయం మేరకు నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయమని చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుదలకు, పెట్టుబడులకు ఇది అత్యంత సానుకూల నిర్ణయమని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకర్లు ప్రజలను ఆన్లైన్ వేదికగా లావాదేవీలు జరిపేందుకు ప్రోత్సహించినట్లయిందన్నారు. నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ నుంచి అతి తక్కువ నగదు వినియోగ వ్యవస్థకు బాటలు పడిందన్నారు. నగదు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థలోకి మళ్లీ నల్లధనం రావొద్దన్నారు. ఎన్నారైలు కూడా మోడీ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు.












Click it and Unblock the Notifications