Fake news:ముంబైలో ఆర్మీని మొహరించడం లేదు, అధికారుల స్పష్టీకరణ
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో క్రమంగా పెరుగుతున్నాయి. ముంబై, పుణెలో 90 శాతం పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో మిలిటరీ దించుతారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వార్త తెగ వైరలవుతోంది. దీనిని అధికారులు ఖండించారు. ముంబైలో ఆర్మీని మొహరించాలని అనుకోవడం లేదు అని.. ఆ వార్త ఫేక్ అని స్పష్టంచేశాయి.
కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?
పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ముంబైలో ఆర్మీని మొహరిస్తారని.. శనివారం నుంచి 10 రోజులపాటు ఆర్మీ ఆధీనంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆర్మీ రంగంలోకి దిగితే.. ఉపేక్షించనుందని భావించి పాలు, మందులు, ఇతర నిత్యావసరాలు స్టోర్ చేసుకోవాలని కోరుతున్నారు. ముంబైలో ఆర్మీ, నేవీ విభాగాలను మొహరించడం లేదు అని అధికారులు స్పష్టంచేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ఆర్మీని రంగంలోకి దించడం లేదు అని.. ఇది ఫేక్ మేసేజ్ అని.. దీనిని నమ్మొద్దని.. అలాగే ఫార్వార్డ్ చేయొద్దని సూచించారు.
దేశంలో మూడో విడత లాక్ డౌన్ మే 17వ తేదీ వరకు ఉన్న సంగతి తెలిసిందే. కానీ మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. మే చివరి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. దీంతో ఫేక్ మేసేజ్ స్ప్రెడ్ కాగా.. ఆర్మీని మొహరించడం లేదు అని.. అది ఫేక్ న్యూస్ అని అధికారులు స్పష్టంచేశారు.